ఈ సారి టీడీపీ ఆవిర్భావ హడావుడి హైదరాబాద్‌లోనే !

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సారి హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా 29న టీడీపీ 41వ ఆవిర్భా వ దినోత్సవం జరుగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులు పాల్గొననున్న ఈ సభకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏపీ శాఖతో కలిపి సంయుక్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్నారు. సభను పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కంటోన్మెంట్ ఎన్నికల కోడ్ కారణంగా అక్కడ స‌‌‌‌‌‌‌‌భ నిర్వహ‌‌‌‌‌‌‌‌ణ సాధ్యం కాలేదు.

నిజాం కాలేజ్ మైదానం, ఎల్బీ స్టేడియంలో స‌‌‌‌‌‌‌‌భ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నా అధికారుల నుంచి సానుకూల స్పంద‌‌‌‌‌‌‌‌న రాలేదు. దీంతో నాంప‌‌‌‌‌‌‌‌ల్లి ఎగ్జిబిష‌‌‌‌‌‌‌‌న్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ లో పార్టీ ఆవిర్భావ స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌ను నిర్వహించేందుకు కాసాని జ్ఞానేశ్వర్ స‌‌‌‌‌‌‌‌మాయ‌‌‌‌‌‌‌‌త్తం అయ్యారు. స‌‌‌‌‌‌‌‌భా నిర్వహ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి అవ‌‌‌‌‌‌‌‌రోధాలు త‌‌‌‌‌‌‌‌లెత్తకుండా 12 క‌‌‌‌‌‌‌‌మిటీల‌‌‌‌‌‌‌‌ను నియమించారు. 2014 తర్వాత మొన్నటివరకు తెలంగాణపై చంద్రబాబు దృష్టి పెట్టకపోవడంతో సానుభూతిపరులు ఇతర పార్టీల వైపు మళ్లారు. ఇటీవల ఖమ్మం సభ విజయవంతం కావడంతో టీడీపీ పై అంచనాలు పెరిగాయి. గ్రేటర్‌లో టీడీపీకి మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్న సమయంలో… క్యాడర్, పార్టీ సానుభూతిపరులను తిరిగి పార్టీ వైపు తెచ్చుకునే దిశగా టీటీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ బహిరంగ సభతో కాస్త మైలేజ్ వస్తుందని, క్యాడర్‌లో జోష్ నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 29న జరగనున్న ఆవిర్భావ దినోత్సవ సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్యనేతలు కూడా హాజరుకానున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇప్పటికే చంద్రబాబు చర్యలు చేపట్టారు. ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి టీడీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని అందిస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో స్థానిక నేతలు పాదయాత్ర చేపడుతున్నారు. టీడీపీ నుంచి ఇతర పార్టీలలోకి వెళ్లిన నేతలు, క్యాడర్ తిరిగి రావాలని చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close