టీడీపీకి ప్రచారాస్త్రంగా జగన్ అఫిడవిట్..!

ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన సందర్భంగా.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్… టీడీపీకి ప్రచారాస్త్రంగా దొరికింది. అందులో… తనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నట్లు.. జగన్మోహన్ రెడ్డి… కేసు వివరాలతో సహా పక్కాగా పేర్కొనడంతో.. ఇతరత్రా సమాచారం.. సేకరించాల్సిన అవసరం టీడీపీ నేతలకు లేకుండా పోయింది. దేశంలో.. ఇన్ని కేసులున్న వ్యక్తి.. ఎన్నికల బరిలో ఎక్కడా నిలబడటం లేదని.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారంటూ.. టీడీపీ నేతలు… విస్తృతంగా విమర్శలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద అఫిడవిట్‌ను దాఖలు చేశారని, 31 కేసుల్లో నిందితుడిగా, ఇన్ని నేరాలతో ఇంకెవ్వరూ అఫిడవిట్‌ దాఖలు చేయరని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇప్పటి వరకూ జగన్ నేర చరిత్రను… చంద్రబాబు చెప్పేవారు. ఇక నుంచి ప్రచారసభల్లో ఈ అఫిడవిట్‌ను కూడా హైలెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. పైగా ఆస్తుల వివరాల్లో.. చాలా వరకు.. ఇప్పుడు అనుభవిస్తున్న ఆస్తుల గురించి రాయలేదు. బెంగళూరులో ఉన్న వైట్ హౌస్, హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ఇళ్లు.. వందల కోట్ల విలువ చేస్తాయి. వాటి గురించి మాత్రం అఫిడవిట్‌లో పేర్కొనలేదు. ఇప్పటికే కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని జగన్ కేసీఆర్‌కు అమ్మేస్తున్నాడనే భావన ప్రజల్లో బలపడుతోందని టీడీపీ నేతుల అంటున్నారు.

ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి కేసులు హైలెట్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ.. సీబీఐ, ఈడీకి చెందిన 11 కేసులు మాత్రమే.. ఉన్నాయని.. వైసీపీ నేతలు చెబుతూ వస్తూంటారు. కానీ వాటి సంఖ్య 31 అని.. వైసీపీ నేతలు అంగీకరించాల్సి వస్తోంది. ఇప్పటికే.. ఈ అఫిడవిట్ ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. దీన్ని టీడీపీ ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close