భూముల ఉచ్చులో టిడిపి నాయకులు

అమరావతిలో రాజధాని రావడానికి తెలుగుదేశం నాయకుల భూముల కొనుగోలు కూడా ఒక కారణమని అందరూ అంగీకరిస్తారు. తాము భూములు కొనలేదని వారూ చెప్పడం లేదు. ఈ విషయంలో లోకేశ్‌ కూడా కొంత ఆగ్రహించినట్టు చెబుతారు. ఇవన్నీ అధినేతకు తెలియకుండా జరుగుతాయనుకోలేము. అయితే రాజధానికి వాస్తు కోణం ప్రధానంగా చూపించారు. రైతుల భూముల సమీకరణ, తిరిగి వాణిజ్య ప్లాట్ల కేటాయింపు సమస్యలు ఎలా వున్నా అనేక ప్రైవేటు సంస్థలకు ఉదారంగా ఎకరాలకొద్ది నామకార్థపు ధరకు కేటాయిస్తున్న మాట నిజం. వారంతా ఎప్పుడు సంస్థలు స్థాపిస్తారో తెలియదు గాని భూములపై హక్కు మాత్రం వచ్చేస్తున్నది. ఇది ఎప్పటికైనా చినికి చినికి గాలివాన కాకపోదు. అయితే ఈలోగానే విశాఖ పట్టణం భూకబ్జాలు శాసనసభలో దుమారం రేపాయి. అందులోనూ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న బిజెపి శాసనసభా పక్ష నాయకుడు చంద్రబాబు సమర్థకుడు అయిన విష్ణుకుమార్‌ రాజు ఈ అంశం లేవనెత్తడం విశేషం. అందుకు ఆధారంగా సాక్షి చదవడం మరింత విశేషం. ఆ దశలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అభ్యంతరం చెబుతున్నా ఈనాడు కూడా చదివారు. వెయ్యి ఎకరాలు పాలక పక్ష ప్రముఖుల అండదండలతో స్వాహా అయిందని ఆయన వివరించారు. సమీకరణలో పోతుందని బెదిరించి భూములు తీసుకున్నారనేది ఆయన ఆరోపణ. మరోవైపున విశాఖకు చెందిన ఎంఎల్‌సి ఎంవిఎస్‌ శర్మ కూడా దాదాపు వెయ్యి ఎకరాల కబ్బాకు సంబందించిన వివరాలు బయిటపెట్టారు. గ్రంథాలయ ఆస్తుల విషయంలో మంత్రి గంటాశ్రీనివాసరావు పాత్రపై అదివరకటి నుంచి ప్రజాసంఘాలు పోరాడుతూనే వున్నాయి. ఇదంతా చూస్తుంటే విశాఖలో టిడిపి భూకబ్బా ఉచ్చులోచిక్కుకున్నట్టే కనిపిస్తుంది. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోతే సమస్య ఇంకా తీవ్రమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close