ప‌వ‌న్ ఫ్యాన్స్ Vs ప్ర‌భాస్ ఫ్యాన్స్‌… ఏమిటీ ఓవ‌రాక్ష‌న్‌??

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కీ ప‌డ‌ద‌ని మ‌న‌కు తెలుసు. కానీ.. తెర వెనుక ఇంత కంటే బీభ‌త్స‌మైన ఉద్రిక్త వాతావ‌ర‌ణం ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కీ, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కీ మ‌ధ్య సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్‌, ప్ర‌భాస్ ఫ్యాన్స్ `సై` అంటే `సై` అనుకొనే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఆ గొడ‌వ‌.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ‌రకూ పాకేసిన‌ట్టు క‌నిపిస్తోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ టైమ్‌లో భీమ‌వ‌రంలోని ఓ సెంట‌ర్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లెక్సీ లాగేసిన ఘ‌ట‌న‌… భీమ‌వ‌రం అంత‌టా ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ప‌వ‌న్ , ప్ర‌భాస్ ఫ్యాన్స్ క‌ల‌బ‌డి కొట్టుకొన్నారు కూడా. ఆ త‌ర‌వాత అది స‌ద్దు మ‌ణిగింది అనుకొంటే… దాని ప్ర‌భావం కాట‌మ‌రాయుడు స‌మ‌యంలోనూ క‌నిపించింది. భీమ‌వ‌రంలో కొంత‌మంది ప్ర‌భాస్ ఫ్యాన్స్ ప‌నిగ‌ట్టుకొని `కాట‌మ‌రాయుడు అట్ట‌ర్ ఫ్లాప్‌` అనే టాక్ విడుద‌ల‌కు ముందే తీసుకొచ్చేయ‌డంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యారు. సినిమా కూడా అంతంత మాత్రంగా ఉండ‌డంతో.. ఇక ప్ర‌భాస్ ఫ్యాన్స్ జోరుకు బ్రేకులు లేకుండా పోయాయి. ప‌వ‌న్ పై. ప‌వ‌న్ స్టైల్‌పై వెట‌కార‌పు పోస్టింగుల‌తో సోష‌ల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.

మ‌రోవైపు ‘బాహుబ‌లి 2’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో.. వెర్రిత‌ల‌లు వేసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. బాహుబ‌లి వేడుక‌లో సైతం ప‌వర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్ అంటూ అరుస్తూ కూర్చున్నారు. పైగా.. ‘మేం ప‌వ‌న్ ఫ్యాన్స్’ అని చెప్పుకోవ‌డానికి సింబాలిక్‌గా మెడ‌లో ఎర్ర‌కండువాలు వేసుకొన్నారు. ఎర్ర కండువా వేసుకొన్న ప్ర‌తి ఒక్క‌డూ ప‌వ‌న్ ఫ్యాన్ కాక‌పోవొచ్చు. కానీ ఆ నింద మాత్రం వాళ్ల‌పై ప‌డుతోంది. రేపు బాహుబ‌లి విడుద‌ల స‌మయంలో వాళ్లు మ‌రింత‌గా రెచ్చిపోవ‌డం ఖాయం. ఇలా మ‌రో హీరోనీ, వాళ్ల ఫ్యాన్స్‌ని తిట్టుకొంటూ, వాళ్ల‌లో వాళ్లు కొట్టుకొంటూ… ఏమిటీ ఓవ‌ర్ యాక్ష‌న్‌! తెర వెనుక‌ బాహుబ‌లి , కాట‌మ‌రాయుడు ఇద్ద‌రూ ఒక్క‌టే. వాళ్లు సినిమాలు చేసుకొంటారు. జేబుల నిండా డ‌బ్బులు పోగేసుకొంటారు. ప‌నీ పాట లేకుండా అభిమానం పేరుతో ఊగిపోయి, చొక్కాలు చించుకొని, దెబ్బ‌లు త‌గిలించుకొని, డ‌బ్బులు పోగొట్టుకొనే వెర్రి వెంగ‌ళ‌ప్ప‌లు మ‌న‌మే. ఈ విష‌యం అతి వీర భ‌యంక‌ర‌మైన ఫ్యాన్స్‌, ఆ పిచ్చిలో ఉన్న యువ‌త‌రం గుర్తించుకోవ‌డం మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close