టీడీపీకి “అమిత్” భరోసా..!?

తెలుగుదేశం పార్టీకి .. ఆంధ్రప్రదేశ్‌లో.. రాజకీయ సవాళ్ల కన్నా.. వైసీపీ నేతలు పెడుతున్న కేసుల భయమే ఎక్కువగా ఉంది. ప్రతీ చిన్న దానికి కేసులు పెట్టి… పార్టీలు మారని ఒత్తిడి చేస్తున్నారు. వీటికి విరుగుడుగా.. టీడీపీ.. అమిత్ షాను చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు.. కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఓ కారణం వెదుక్కుని ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. అమరావతిని దేశ పొలిటికల్ మ్యాప్‌లో పెట్టినందున కృతజ్ఞతలు చెప్పేందుకు అంటూ.. ఎంపీలు.. అమిత్ షా వద్దకు వెళ్లారు. తమకు ఎదురవుతున్న పరిస్థితుల్ని ఎకరువు పెట్టారు. విపక్ష పార్టీలపై పోలీసులను ప్రయోగించి.. చేస్తున్న వేధింపులపై ఫిర్యాదు చేశారు.

ఆత్మహత్యలు చేసుకున్న కొంత మంది నేతల వివరాలనూ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై.. అమిత్ షా కూడా.. భరోసాగా స్పందించారని.. టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో.. చాలా ఫిర్యాదులు వచ్చాయని.. తనకు ఏం జరుగుతుందో.. మొత్తం తెలుసని.. తాను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లుగా ఎంపీలు చెబుతున్నారు. చేతిలో పోలీసు వ్యవస్థ ఉండటంతో.. వైసీపీ.. విపక్ష పార్టీలను.. చాలా హై రేంజ్ లో టార్గెట్ చేస్తోంది. సోషల్ మీడియా పోస్టులను కూడా.. స్వేచ్చగా పెట్టుకోలేని పరిస్థితి విపక్ష పార్టీలకు ఉంది. ఇక గ్రామాలలో … వైసీపీ సానుభూతి పరుల దూకుడు..మామూలుగా లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం అండగా ఉంటానని చెబుతోంది. న్యాయసాయం చేస్తోంది. కానీ పరిస్థితి… రాను రాను దిగజారిపోతోంది. అందుకే.. అమిత్ షా వద్దకు టీడీపీ ఎంపీలు వెళ్లినట్లు చెబుతున్నారు. అమిత్ షా భరోసా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి ఏపీలో శాంతిభద్రతలపై నేరుగా కల్పించుకోలేరు. కానీ.. పరోక్షంగా ఒక్క వార్నింగ్ ఐపీఎస్ అధికారులకు పంపితే.. మొత్తం సెట్ అవుతుందని.. టీడీపీ నేతలు నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close