గుడివాడ కేసినో ఆధారాలు రిలీజ్ చేసిన టీడీపీ !

గుడివాడలో కేసినో నిర్వహించామని నిర్వహిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. అయితే కేసినో నిర్వహించారన్నదానికి అన్ని ఆధారాలూ సమర్పిస్తామని టీడీపీ చెబుతోంది. ముందుగా కేసినో నిర్వాహకులు.. పెట్టిన మీడియా పోస్టులను .. వాటి లింక్‌లను విడుదల చేశారు. యాసెస్ కాసినో అనే కంపెనీ గుడివాడలో తాము మూడు రోజుల పాటు కేసినో నిర్వహించామని.. సంక్రాంతి పండుగ అయిన పదిహేనో తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇంకా ఆలాగే ఉంది.

వాటిని స్క్రీన్ షాట్లు తీసి టీడీపీ ప్రచారం చేస్దోంది. అలాగే ఈ యాసెస్ కేసినో నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ప్రిమాల్ టోపీవాలా అనే వ్యక్తి పెట్టి సోషల్ మీడియా పోస్టును కూడా టీడీపీ మీడియాకు రిలీజ్ చేసింది. ఆ రెండు వీడియోల్లో చాలా స్పష్టంగా కేసినో నిర్వహిస్తున్నట్లుగా ఉంది. మూడు రోజుల పాటు తాము కేసినో నిర్వహించామని వారు ప్రకటించుకున్నారు. వైసీపీ నేతలు కూడా తాము కేసినో నిర్వహించామని అన్యాపదేశంగా చెబుతున్నారు.

కానీ కొడాలి నాని మాత్రం కేసినో నిర్వహించామని నిరూపించాలంటూ సవాల్ చేశారు. ఈ ఆధారాలతో తాము డీజీపీకి ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలైనా తీసుకుంటారన్న నమ్మకం లేదని.. తాము ప్రజాస్వామ్య పద్దతిలో తాము పోరాటం చేస్తామని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close