“బండి”కి న్యాయం.. నాకు అన్యాయమా ?: రఘురామా

బండి సంజయ్‌పై పోలీసుల దాడిని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు కారణమైన వారందర్నీ పిలిపించి ప్రశ్నించబోతోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. అయితే.. బండి సంజయ్ కన్నా ఎక్కువగా ఇబ్బంది పడిన ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మాత్రం లోక్‌సభ ప్రివిలేజ్ కమటీ వేగం చూసి అసంతృప్తికి గురవుతున్నారు. తనపై ఏపీ పోలీసులు చేసిన దాడి గురించి చేసిన ఫిర్యాదులో ఎందుకు ఇంకా స్పందించలేదని ఆయన మథనపడుతున్నారు.

ఈ విషయంలో ప్రజలు సందేహాలు లేవనెత్తుతున్నారని అంటున్నారు. ఈ డౌట్ సామాన్యులకు కూడా వస్తోంది. రఘురామకృష్ణరాజును ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి.. కొట్టారని భావిస్తున్నారు. ఓ ఎంపీని అలా కొట్టడంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆయన ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కానీ బండి సంజయ్ విషయంలో మాత్రం శరవేగంగా చర్యలకు సిద్ధమవుతున్నారు.

అందుకే తనను కొట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజానికి ఆయన వైసీపీకి దూరమైన తర్వాత బీజేపీకే దగ్గరగా ఉంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రధానిని.. అమిత్ షాను కలిసి తనను మర్చిపోకుండా చూసుకుంటున్నారు. ఈ కారణమో ఏమో కానీ వైసీపీ ఎంత ప్రయత్నించినా ఆయనపై అనర్హతా వేటు మాత్రం వేయలేదు. కానీ ఆయనను కొట్టిన వారిపై చర్యల్లో మాత్రం అంత వేగం చూపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close