తెరపైకి మళ్లీ దళిత బంధు !

హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిన రెండున్నర నెలల తర్వాత దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ మరో ప్రకటన చేశారు. నిజానికి గత డిసెంబర్‌లోపే హుజురాబాద్‌తో పాటు నాలుగు దిక్కులా ఉన్నా నాలుగు మండలాల్లో దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. మార్చిలోపు అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో వంద మంది చొప్పున ఇస్తామన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంటపోయారు.

ఇప్పుడు మళ్లీ కలెక్టర్లకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో యూనిట్‌కు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయమని సీఎం కేసీఆర్‌ అధికారులకు తెలిపారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలన్నారు. ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని చూచించారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు ఆమెదించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్లు కేటాయించామని … ఈ నిధుల్లో ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు.

మిగతా నిధులను విడతల వారీగా విడుదల చేస్తామని ప్రకటించారు. దళిత బంధు పథకం అమలు కోసం విపక్షాలు ఉద్యమం చేసే ఆలోచనలో ఉండటంతో హఠాత్తుగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పథకం ముందుకు నడుస్తుందా.. లేదా అన్నదానిపై మాత్రం ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఫర్ సరే.. మద్దాలి గిరిది ఏ పార్టీ.. ఏ పార్టీకి ఓటేశారు !?

ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలై.... ధిక్కరించిన ఎమ్మెల్యేలంటూ కొంతమంది పై వేటేసిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తమకు కూడా ఆఫర్లు...

పోలవరం ఎత్తు లోక్‌సభకు..రాజ్యసభకు వేర్వేరు !

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుతో కేంద్రం ఆటలు ఆడుతోంది. క్లారిటీ లేకుండా విరుద్ధమైన సమాధానాలు చెబుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు గత నాలుగేళ్లుగా పూర్తిగా ఆగిపోయాయి. డబ్బులు రీఎంబర్స్ చేయాల్సిన పని...

రాజీనామా డిమాండ్లను సీరియస్‌గా తీసుకుంటున్న కేటీఆర్ !

పేపర్ల లీకేజీ విషయంలో విపక్ష పార్టీలన్నీ తనను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూండటంతో కేటీఆర్ అసహనానికి గురవుతున్నారు. విపక్షాల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోమవారం సిరిసిల్ల రాజన్న జిల్లాలో...

కుమారుల రాజకీయంతో నలిగిపోతున్న డీఎస్ !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగిన డీఎస్ ఇప్పుడు కుమారుల రాజకీయంతో నలిగిపోతున్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. కానీ సోమవారం ఆయన పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close