వైసీపీ రిగ్గింగ్ ఆర్తనాదాలు – టీడీపీ హ్యాపీ !

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎవరైనా ఆర్తనాదాలు చేస్తూంటే.. ప్రత్యర్తి పార్టీకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ గగ్గోలు పెట్టింది. వైసీపీ ఎంజాయ్ చేసింది. ఈ సారి రివర్స్ అయింది. వైసీపీ ఆర్తనాదాలు చేస్తోంది. టీడీపీ హ్యాపీగా చూస్తోంది. మాచర్ల ఇష్యూలో టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ నేతలు హఠాత్తుగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు.

పిన్నెల్లి పరారీ తర్వాత టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందనే ఈవీఎం ధ్వంసం చేశారనే వాదనతో తెరపైకి వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు అదే చెప్పారు. విదేశాలకు పోకుండా ఇక్కడే ఉన్న పల్నాడు నేతలంతా వెళ్లి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ విదేశాల నుంచి సాక్షి మీడియాతో మాట్లాడి ఆరోపణలు చేశారు. అదే సమయంలో సోషల్ మీడియాలో టీడీపీ రిగ్గింగ్ పేరుతో ట్రెండింగ్ చేశారు. ఉత్తరాది అకౌంట్లు, విదేశీ అకౌంట్లతో చాలా ట్వీట్లు చేశారు. ఈ ట్రెండింగ్ చూసి టీడీపీ వర్గాలు మరింత సంతోషంగా ఉన్నాయి.

ఓటమికి కారణాలు చెప్పుకుంటూంటే తాము ఎందుకు డిస్ట్రబ్ చేయాలని వారు అనుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత గెలుస్తామని గంభీరమైన ప్రకటనలు చేయడమే కాదు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలు వెదుక్కోకూడదు. వెదుక్కుంటే ఘోరమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే.. ఓడిపోతామని తెలిసే రచ్చ చేస్తున్నారని అందరికీ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రజలకు వైసీపీ నేతలు అదే క్లారిటీ ఇస్తున్నట్లుగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

అమరావతిలో జగన్ గుర్తులు అలాగే !

అమరావతిలో జగన్ జ్ఞాపకాల్ని అలాగే ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ జ్ఞాపకాలు అంటే ఆయన నిర్మించినవి ఏవీ లేవు. ధ్వంసం చేసివవే. ముఖ్యంగా ప్రజావేదిక. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న తెలివి...

ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌లో అసలు కథ త్వరలో !

విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఆయన భార్య, కుమారుడ్ని నిర్బంధించి ఆస్తులు రాయించుకున్న ముఠా వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడూ బయటకు రాలేదు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారో కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close