ఫిరాయించిన ఆ నలుగురిపై అనర్హతా వేటుకు టైం?

తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఆ నలుగురికి కూడా టీడీపీ విప్ జారీ చేసింది. ఏపీ ఎమెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి పంచుమర్తి అనూరాధకు ఓటు వేయాలని మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లిలకు కూడా విప్ జారీ చేశారు. ఇప్పుడు వీరు తప్పని సరిగా ఓటింగ్ లో పాల్గొని.. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. వేయకపోయినా గైర్హాజర్ అయినా టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తుంది. ఇది విప్ ఉల్లంగన వ్యవహారం కాబట్టి స్పీకర్ కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఏడుగురు ఎమ్మెల్సీలు అవుతారు. వైఎస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ బలంతో ఆరుగురు మాత్రం గెలవగలరు. కానీ ఏడో సీటు కోసం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఓటు వేస్తే గెలుస్తుంది.

అలాగే వైసీపీ నుంచి ధిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. అయితేవారికి కూడా వైసీపీ విప్ జారీ చేస్తుంది. అదే జరిగితే వారి పార్టీకి ఓటు వేయకపోతే వారిపైనా అనర్హతా వేటు పడుతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాహుల్ అనర్హతపై టీడీపీ, వైసీపీ స్పందించలేదేంటి?

రాహుల్ గాంధీ అనర్హతపై దేశం గగ్గోలు పెడుతుంది. రాహుల్ గాంధీనే వదల్లేదంటే ఇక ప్రతిపక్ష నేతలు మిగలరని.. నియంతృత్వం వచ్చేసినట్లేనని బీజేపీయేతర పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ...

కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ లేనట్లే.. !

తెలంగాణ బయట రెండో బహిరంగసభను కూడా కేసీఆర్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక వైపు చూడటం లేదు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల...

చైతన్య : జారుడు ప్రారంభిస్తే తేలేది పాతాళంలోనే !

నాలుగేళ్ల పాటు తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్న వైఎస్ఆర్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో పరాజయం గట్టి షాక్ ఇస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ స్థానం కోల్పోవడం...

50 డేస్ : మిన్నంటుతున్న యువగళం !

యువగళం పాదయాత్ర యాభై రోజులయింది. కుప్పం నుంచి ప్రారంభించి పుట్టపర్తి నియోజకవర్గం వరకూ వచ్చారు. ఈ యాభై రోజుల్లోనే అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పట్టభద్రులు టీడీపీ వైపు ఉన్నట్లుగా తేలింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close