ఫిరాయించిన ఆ నలుగురిపై అనర్హతా వేటుకు టైం?

తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఆ నలుగురికి కూడా టీడీపీ విప్ జారీ చేసింది. ఏపీ ఎమెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి పంచుమర్తి అనూరాధకు ఓటు వేయాలని మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లిలకు కూడా విప్ జారీ చేశారు. ఇప్పుడు వీరు తప్పని సరిగా ఓటింగ్ లో పాల్గొని.. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. వేయకపోయినా గైర్హాజర్ అయినా టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తుంది. ఇది విప్ ఉల్లంగన వ్యవహారం కాబట్టి స్పీకర్ కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఏడుగురు ఎమ్మెల్సీలు అవుతారు. వైఎస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ బలంతో ఆరుగురు మాత్రం గెలవగలరు. కానీ ఏడో సీటు కోసం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఓటు వేస్తే గెలుస్తుంది.

అలాగే వైసీపీ నుంచి ధిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. అయితేవారికి కూడా వైసీపీ విప్ జారీ చేస్తుంది. అదే జరిగితే వారి పార్టీకి ఓటు వేయకపోతే వారిపైనా అనర్హతా వేటు పడుతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close