30 మంది విద్యార్థులకో టీచర్..! ఏపీలో ఉద్యోగాల విప్లవం..!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా.. ఆయన విద్యావ్యవస్థను ప్రక్షాళించాలని… పట్టుదలతో ఉన్నారు. మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా..అన్నింటికి మించి… ఉపాధ్యాయ శక్తిని పెంచాలనుకుంటున్నారు. స్కూళ్లలో… వంద మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండే పరిస్థితి లేదు. అందుకే.. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రతి 30 మందికి ఒక టీచర్ ను నియమించాలని నిర్ణయించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మందికి ఒకరు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో ప్రతి 35మంది విద్యార్థులకు ఒకరు చొప్పున టీచర్‌ ఉండాలి. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని జగన్ నిర్ణయించారు.

విద్యార్థులు – టీచర్ల నిష్పత్తిని పాటించాలంటే… పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం యాభై వేల మందికిపైగా కొత్తగా టీచర్లను విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందని అంచనా. ఈ మేరకు జనవరిలో డీఎస్సీ విడుదల చేసే అవకాశం ఉంది. ఒక్క ఏడాది కాదు.. ప్రతీ ఏటా.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియను ఏటా జనవరి నుంచి ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దీని జనవరిలో కొత్త డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ ఏడాది డిసెంబరు 31నాటికి ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను దానిద్వారా భర్తీ చేస్తారు. ఏప్రిల్‌, మే నెలల్లో రాత పరీక్షలు నిర్వహించి.. స్కూళ్లు తెలిచే సమయానికి నియామకపత్రాలిస్తారు.

ఇకపై ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని జగన్ ననిర్ణయం తీసుకున్నారు. టీచర్లను పెంచితే దీనిద్వారా సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతాయని దగన్ అంచనా వేస్తున్నారు. అయితే.. ఇప్పటికే… గత సర్కార్… డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ పరీక్షలు నిర్వహించింది. ఆ ఫలితాలు ఇంత వరకూ విడుదల చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ.. ఆ ఫలితాలను ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంచారు. ముందుగా ఆ ఫలితాలను ప్రకటించి.. కొత్త టీచర్లను.. విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close