తెలకపల్లి రవి : చంద్రబాబు, కెసిఆర్‌ పాచికలు- మిథ్యా శత్రువులు

అసలు శత్రువును దెబ్బతీయాలంటే లేని శత్రువును ముందుకు తేవాలన్న వ్యూహం తెలంగాణ ఎపి ముఖ్యమంత్రులు బాగా అమలు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌తో జట్టుకట్టి దాన్ని ఢిల్లీ దాకా చేర్చారు టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడు అసలు లక్ష్యం ఎపిలో అధికారం నిలబెట్టుకుని తెలంగాణలో అస్తిత్వాన్ని నిల్పుకోవడం. ఈ కాంగ్రెస్‌ టర్న్‌కు తొలి అడుగు తెలంగాణలో వేశారు గనక ఆ ముఖ్యమంత్రి దాన్ని తన ఆయుదంగా చేసుకున్నారు. మళ్లీ ఆంధ్ర ఆధిపత్యం అంటూ పల్లవి ఎత్తుకున్నారు. మొత్తం టిఆర్‌ఎస్‌ నాయకులంతా దాన్నే అందిపుచ్చుకున్నారు. ఆఖరుకు ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్త పలుకులో కూడా చంద్రబాబు జోక్యమే ప్రధానాంశమైనట్టు చెబుతున్నారు. అసలు ప్రత్యర్తిగా వున్న కాంగ్రెస్‌ను తక్కువ చేయడం కెసిఆర్‌కు ఒక విధంగా అవసరం. చంద్రబాబు ప్రభావం ఎక్కువగా చూపడం ఆర్కే సహజ లక్షణం. తన పాత్ర ఏమీ వుండదంటూనే ఈ మిథ్య్నను కొనసాగించడం చంద్రబాబుకు అవసరం.

ఎపికి వస్తే ప్రత్యేక హోదా విభజన నిధుల విషయంలో మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం నిరాకరణ నిజం . అయితే ఆ విషయమై అయిదేళ్లలో నాలుగేళ్లకు పైనమాట్లాడకుండా వుండిపోయిన టిడిపి ఇప్పుడు తనే వీరోచిత పోరాటం చేస్తున్నట్టు చెప్పుకోవడంలో విశ్వసనీయత లేదు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ప్రదానాంశమైనట్టు చంద్రబాబు రోజుకు పదిసార్లు చెబుతున్నారు. పైగా జగన్‌,పవన్‌ కళ్యాణ్‌లు మోడీతో చేతులు కలిపినట్టు ఆరోపిస్తున్నారు. ఎవరు ఏం చెప్పినా ఎపిలో బిజెపి చెప్పుకోదగిన శక్తి కానేకాదు. దాన్ని ముందు పెట్టి వైసీపీ జనసేనలను దెబ్బతీయాలని చంద్రబాబు వ్యూహం. దానికోసం లేని బిజెపిని పెద్దది చేసి వున్న రెండు ప్రధాన పార్టీలను దానికి తోకలుగా చూపిస్తున్నారు.

మొత్తంపైన ఉభయ చంద్రులూ ఒకే రకం రాజకీయాలు పాటిస్తున్నారన్న మాట. శుభం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close