తెలంగాణా, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఖరారు

గోదావరి జలాలపై తెలంగాణా రాష్ట్రంలో ఐదు బ్యారేజీల నిర్మాణానికి మరియు నదీ జలాలను పంచుకోవడం కోసం తెలంగాణా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఒప్పంద కుదుర్చుకొన్నాయి. వాటిపై తెలంగాణా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ ఇవ్వాళ్ళ ముంబైలో సంతకాలు చేసారు. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణాలో గోదావరి నదిపై ఐదు చోట్ల బ్యారేజిలు నిర్మించుకోవడానికి వీలవుతుంది. తద్వారా సముద్రంలోకి వృధాగా పోతున్న ప్రాణహిత, లోయర్ పెన్ గంగ మరియు ఇంద్రావతి నదుల 4000 టి.ఎం.సి.ల జలాలను తెలంగాణా రాష్ట్రం వినియోగించుకోగలుగుతుంది. దాని వలన తెలంగాణాలో వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుటుంది. కొత్తగా అనేక వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుండి దీని పరిష్కారం కోసం తెరాస ప్రభుత్వం తరపున బారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చాలా కృషి చేసారు. ఆయన కృషి ఫలితంగానే ఎట్టకేలకు ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభించింది. కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈరోజు కుదిరిన ఒప్పందం చారిత్రిక ఒప్పందం అని చెప్పిన కేసీఆర్ మాటలు నూటికి నూరు శాతం నిజమేనని అంగీకరించవచ్చును. ఈ నదీ జలాల పంపకాలు, బ్యారేజీల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాలు కలిసి ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేసుకోబోతున్నాయి.

ఇంతవరకు ఒకే రాష్ట్రంగా కలిసి ఉన్న ఆంద్రా, తెలంగాణా రాష్ట్రాలు నదీ జలాల విషయంలో చాలా గొడవలు పడ్డాయి కానీ పెద్దగా శ్రమపడకుండానే తెలంగాణా ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోగలిగింది. తెదేపా, తెరాసల మధ్య నెలకొని ఉన్న రాజకీయ విభేదాలు, వైషమ్యాల కారణంగానే రెండు తెలుగు ప్రభుత్వాల మధ్య గొడవలకు మూల కారణమని అర్ధం అవుతోంది. కనుక ఇప్పటికయినా ఆ రెండు పార్టీలు తమ రాజకీయ విభేదాలను పక్కను పెట్టి రెండు రాష్ట్రాలలో రైతన్నలకు మేలు చేకూరేవిధంగా నిర్ణయాలు తీసుకొంటే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close