ఆ 1.40 లక్షల కోట్లపై తెదేపా స్పందించలేదేమిటో?

రాజమండ్రిలో మొన్న బీజేపీ బారీ బహిరంగ సభను నిర్వహించడం మిత్రపక్షమయిన తెదేపా జీర్ణించుకోవడం కష్టమే. ఎందుకంటే అది రాష్ట్రంలో తెదేపాకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ చేసిన తొలి ప్రయత్నం కనుక. అంతే కాదు రాష్ట్రంలో తమ పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సమాధానం చెప్పడానికే వచ్చేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభలో చెప్పడం మరొక షాక్ అనుకొంటే, రాష్ట్రంలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ పధకాల కోసం ఈ 22 నెలల వ్యవధిలో తమ ప్రభుత్వం రాష్ట్రానికి మొత్తం 1.40 లక్షల కోట్లు మంజూరు చేసిందని ఆయన చెప్పడం అంతకంటే పెద్ద షాక్ అని చెప్పవచ్చును. ఎందుకంటే రాష్ట్ర విభజన కారణంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేయడం లేదనట్లు తెదేపా నేతలు మాట్లాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు 1.40 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు అమిత్ షా బహిరంగ సభలో బయటపెట్టారు.

ఆయన చెప్పిన ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా మంత్రులు, నేతలు ఎవరూ కూడా ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. అమిత్ షా చెప్పిన దానిని అంగీకరిస్తే ఇంత కాలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టినట్లవుతుంది. అలాగని ఖండిస్తే బీజేపీకి, కేంద్రప్రభుత్వానికి ఆగ్రహం కలిగించినట్లవుతుంది. కనుకనే తెదేపా నేతలు అసలు ఆ బీజేపీ సభ ఊసే ఎత్తడంలేదనుకోవలసి ఉంటుంది. త్వరలో ఉత్తరాంద్ర, రాయలసీమలో కూడా మరో రెండు బహిరంగ సభలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు ఇదివరకే ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close