ఖాళీగా ఉన్న నేతలందరికీ బీజేపీ నుంచి ఆహ్వానాలు !

తెలంగాణలో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని చెప్పడానికో .. లేకపోతే సీనియర్ నేతల అవసరం ఉందనుకుంటున్నారో కానీ తెలంగాణలో ఖాళీగా ఉన్న నేతలందరికీ బీజేపీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్‌కు రోజూ అదే డ్యూటీ అయిపోయింది. తాజాగా ఆయన మాజీ ఎమ్మెల్యే జయసుధకు సమాచారం పంపారు. బీజేపీలో చేరాలన్నారు. అయితే ఆమె గత ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. తర్వాత వైసీపీ వాళ్లకు ఆమె గుర్తు లేదు. ఆమె కూడా పట్టించుకోలేదు.

ఇప్పుడుబీజేపీ కూడా కండువా కప్పుకోవాలని పిలిచింది. ఎన్నికల్లో పోటీ చేసి ఓపిక లేదని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అంగీకరిస్తారో లేదో తెలియదు. అదే సమయంలో టీడీపీలో కీలకంగా ఉండి.. తర్వాత టీఆర్ఎస్‌లో చేరినా ఎలాంటి ఆదరణ లేని నిజామాబాద్‌కు చెందిన కీలక నేత మండవ వెంకటేశ్వరరావుకు కూడా ఈటల బృందం ఫోన్ చేసింది. దీంతో ఆయన కకూడా డైలమాలో ఉన్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కుమార్తె విజయం కోసం ఇంటికెళ్లి మరీ కండువా కప్పిన కేసీఆర్ తర్వాత ఆయనను పట్టించుకోలేదు.

ఎమ్మెల్సీ.. రాజ్యసభ ఎన్నికల సమయంలో పేర్లను ప్రచారం చేస్తారు కానీ చివరికి హ్యాండిచ్చారు. ఇప్పుడు ఆయన కూడా బీజేపీ వైపు చూస్తారేమోతెలియదు. ఇలా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండి ఖాళీగా ఉన్న నేతలకు కండువా కప్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున చేరికలను చేశానని చెప్పుకునేందుకు ఈటల తాపత్రయ పడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close