మాధవ్ ఫిర్యాదు మీదే విచారణ చేస్తున్నారట !

న్యూడ్ వీడియో విషయంలో ఎంపీ మాధన్‌ను రక్షించడమే కాదు.. బాధితుడిగా చూపించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశం ఎంతకీ సద్దుమణగకపోతూండటం .. విచిత్రమైన రియాక్షన్స్‌తో అందరూ ప్రజల దృష్టిలో చులకన అవుతూండటంతో ప్రభుత్వం మరో విచిత్రమైన వేషం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మాధవ్‌ను బాధితుడిగా చూపించేందుకు సిద్దమవుతున్నట్లుగా కనిపిస్తోంది. చాలారోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన హోంమంత్రి.. ఇక్కడ బాధితడు మాధవేనని..ఆయనే ఫిర్యాదు చేశారని.. ఆయన ఫిర్యాదుపైనే విచారణ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మహిళా బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.

ఎవరూ ఫిర్యాదు చేయకుండా సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎలా విచారణ చేస్తామని ఆమె ప్రశ్నించారు. ఆ వీడియో మార్ఫింగ్ అని మాధవ్ పిర్యాదు చేసినందున ఆయన ఫిర్యాదుపై చర్యలు తీసుకునేందుకు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని హోంమంత్రి చెప్పుకొచ్చారు. మాధవ్ వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఆయనను సమర్థించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించడం ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

ఎంపీ మాధవ్‌కే కాదు.. ఈ ప్రభుత్వమూ విలువలు వదిలేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో ఈ అంశం సద్దుమణగకపోతే ఆ తర్వాత అది ఫేక్ వీడియో అని చెప్పి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసే అవకాశం లేకపోలేదన్న అనుమానం టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో ఏదైనా జరగొచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close