తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. ముఖ్యనేతల సమావేశం పెట్టి.. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ ఆఫీసులో ప్రెస్మీట్ అంటే.. పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలని కానీ ఇష్టం వచ్చిటన్లుగా వ్యక్తిగత విమర్శుల చేసి.. నిందలు వేసి సొంత రాజకీయం చేస్తే సహించేది లేదన్నారు. కిషన్ రెడ్డి ఆగ్రహంతో చాలా మంది సీనియర్ల మొహం మాడిపోయింది. ఎందుకంటే.. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో చాలా మంది నేతలు ప్రెస్మీట్లు పెట్టారు.
బీఆర్ఎస్ లో వ్యవహారాలపై చాలా మంది నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు. బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఇవన్నీ పార్టీ ఆఫీసులో కూర్చుని చేయడంతో పార్టీ అధికారిక స్టాండ్ గా ప్రజల్లోకి వెళ్లింది. ఇది కిషన్ రెడ్డికి నచ్చలేదు. అందుకే పార్టీ నేతలకు క్లాస్ పీకారు. నిజానికి ఇటీవలి కాలంలో బీజేపీ అగ్రనేతలంతా ఎవరి రాజకీయం వారిదన్నట్లుగా ఉన్నారు. కేంద్ర మంత్రి, టీ బీజేపీ చీఫ్ గా ఉన్న కిషన్ రెడ్డి .. పార్టీపై తక్కువ సమయం కేటాయిస్తున్నారు. అదే సమయంలో ఆధిపత్య పోరాటం, సొంత రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ఇదగి శృతి మించడంతో కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. టీ బీజేపీ అధ్యక్షుడ్ని హైకమాండ్ ఇంకా ప్రకటించడం లేదు. అలా ప్రకటిస్తే.. పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయని పార్టీ స్టాండ్ ఏమిటో అందరికీ స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఇంకా పార్టీ అధ్యక్షుడ్ని నియమించడానికి ఎలాంటి ఆసక్తి కనబర్చడం లేదు. బీజేపీ విషయంలో హైకమాండ్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ఆ పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు.