తెలంగాణలో మరో 43 పాజిటివ్ కేసులు.. టోటల్ 272..!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శనివారం రోజు.. ఈ సంఖ్య 43కి చేరింది. వివిధ జిల్లాల్లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు.. వారి పాజిటివ్ కేసులు కలిపి… వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారికి ఈ వైరస్ సోకింది. ఆదిలాబాద్ నుంచి నల్లగొండ వరకూ.. పాజిటివ్ కేసులు తేలిన వారు ఉన్నారు. వరంగల్‌లోనూ పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 90 శాతం వరకూ పాజిటివ్ కేసులు బయటపడుతూ వచ్చాయి. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి వల్ల జిల్లాల్లోనూ ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం రోజు.. 75 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ 32 మంది కి కరోనా నయం అయింది.

దేశం మొత్తం తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లిన వారి కారణంగానే… పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు ఉన్న మహారాష్ట్రలో శనివారం మరో 47 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరందరూ తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లిన వారే. తమిళనాడు, కర్ణాటకల్లోనూ.. అత్యధికంగా తబ్లిగీలకే పాజిటివ్ గా తేలుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మూడు వేల పాజిటివ్ కేసులు దాటిపోయింది. మృతుల సంఖ్య వందకు చేరువ అవుతోంది. మరో వైపు ప్రధానమంత్రి దేశంలోని పరిస్థితులపై విపక్షాలతో చర్చించాలని అనుకుంటున్నారు.

ఎనిమిదో తేదీన అఖిలపక్ష సమావేశాన్ని.. ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగనున్న ఈ భేటీలో.. లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్ని చర్చిచే అవకాశం ఉంది. తబ్లిగీలు తప్ప.. ఇతర పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గిపోయినందున.. లాక్ డౌన్ రిలాక్సేషన్ ఇస్తే ఎలా ఉంటుందన్నదానిపై విపక్షాల సూచలను ప్రధాని తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close