తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మూడు పదవులతో ముగిసింది. రాజ్ భవన్లో గడ్డం వివేక్ , అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో తెలంగాణ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య పదిహేనుకు చేరింది. మరో మూడు ఖాళీగా ఉన్నాయి. మంత్రులను తప్పించడం లేదా శాఖలను మార్చడం లాంటి పనులేమీ ప్రస్తుతం పెట్టుకోవడంలేదు.ల ఎవరికీ కేటాయించని శాఖలను వారికి కేటాయించనున్నారు.
అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు ఆవేశంలో ఉన్నారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డిరంగారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారికి సర్ది చెప్పేందుకు మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు. వారి ఇళ్లకు వెళ్లి బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి. ఆల్ రెడ్డిరంగారెడ్డి మాత్రం రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ మూడు పదవులతోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు, గ్రేటర్ కు మంత్రి పదవి రాలేదు. మైనార్టీకి కూడా మంత్రి పదవి కేటాయించలేదు. ఈ అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోతుంది. ఓ మూడు పదవుల్ని భర్తీ చేయడానికి ఇంత కాలం పట్టింది..మిగతా పదవుల్ని భర్తీ చేయడానికి ఎంత కాలం పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.