తెలంగాణ కాంగ్రెస్‌కు పని కల్పించిన పోతిరెడ్డిపాడు..!

చాలా కాలంగా రాజకీయ కార్యక్రమాల్లేక… సబ్జెక్టుల్లేక ఇబ్బంది పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు.. పోతిరెడ్డిపాడుపై ఏపీ కట్టాలనుకుంటున్న ప్రాజెక్ట్ బాగా ఉపయోగపడుతోంది. ఏపీ ఇచ్చిన జీవో విషయంలో.. కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారు. దక్షిణ తెలంగాణ నీటి ప్రాజెక్టుల పై కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో నిరసన దీక్ష చేపట్టేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విస్తరణకు ఆరు నెలలుగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని..దీని పై కాంగ్రెస్ పార్టీ హెచ్చరించినా పట్టించుకోలేదని.. ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఇదే సమయంలో కేసిఆర్ జగన్ మోహన్ రెడ్డి తో కలసి ఆలయ్ లయ్ చేసుకుంటున్నారని… వీరి స్నేహం తెలంగాణ ప్రజలకు ,రైతాంగానికి గొడ్డలి పెట్టు గా మారిందని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ సమస్యను కేసిఆర్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ..ఇదేమి వారిద్దరి ఇంటి వ్యక్తిగత వ్యవహారం కాదంటున్నారు. పాత విషయాలను కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్నారు. పోతిరెడ్డిపాడు వైఎస్ జీవో విడుదల చేసినప్పుడు కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారని.. అప్పుడు ఖండించలేదని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.

ముచ్చుమర్రి ప్రాజెక్ట్ ను సైతం కేసిఆర్ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు నిర్మించారని.. ఆయనా అభ్యంతరం చెప్పలేదంటున్నారు. ఇలా అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు పట్టదలతో పని ప్రారంభించారు. అయితే.. టీ కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపుల గోల ఇక్కడా కనిపిస్తోంది. ఎవరికి వారు.. పోతిరెడ్డిపాడుపై తమ వాదన వినిపిస్తున్నారు కానీ.. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ తరపున వాదనలు వినిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close