ఓం సిటీ కోసం 505 ఎకరాల భూమి మంజూరు?

ఈనాడు మీడియా గ్రూప్ చైర్మన్ రామోజీరావు నిర్మించబోతున్న ‘ఓం సిటీ’ ఆధ్యాత్మిక నగరానికి 505 ఎకరాల భూమిని ఇవ్వడానికి తెలంగాణా ప్రభుత్వం లైన్ క్లియర్ చేసినట్లు తాజా సమాచారం. రెవెన్యూ అధికారులు అందుకు అవసరమయిన ప్రతిపాదనలు అన్ని సిద్దం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపించినట్లు తెలుస్తోంది. ఓం సిటీ నిర్మించేందుకు రామోజీరావు 2,000 ఎకరాల భూమి కావాలని గత ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నారు.

ఆ తరువాత రామోజీరావు ప్రధాని నరేంద్ర మోడిని కలిసి వచ్చేరు. అప్పటి నుండి రామోజీ పట్ల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. అంతవరకు ఆయనను, ఈనాడు మీడియాని ద్వేషిస్తున్న ఆయన స్వయంగా తన మంత్రులను వెంటబెట్టుకొని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఆయనని కలిసి వచ్చేరు. ఆ సందర్భంగా రామోజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ‘ఓం సిటీ’ చిత్రాలు చూపించడం అప్పుడే దానికి అవసరమయిన భూమిని సమకూర్చేందుకు కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం జరిగిపోయాయి. కానీ ఒకే చోట 2000 ఎకరాలు లభించకపోవడంతో, ముందుగా హయత్ నగర్ మండలంలోని కోహెడ, అబ్దుల్లాపూర్ గ్రామాలలో 505 ఎకరాలను రామోజీకి అప్పగించేందుకు అధికారులు అని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అందులో ఆయన రూ.3,000 కోట్ల వ్యయంతో దేశంలో ఉన్న అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాల నమూనాలను నిర్మించాలనుకొంటున్నారు. ఎప్పుడు తెల్లటి బట్టలు ధరించే రామోజీరావు సూటుబూటు వేసుకొని పనిగట్టుకొని డిల్లీ వెళ్లి తమ సంస్థలు చేపడుతున్న స్వచ్చా భారత్ కార్యక్రమాల గురించి, పనిలోపనిగా ఈ ‘ఓం సిటీ’ గురించి ప్రధాని నరేంద్ర మోడికి వివరించి వచ్చేరు. కనుక ఇక దానికి ఎవరి నుంచి అడ్డంకులు ఎదురవకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close