ఓం సిటీ కోసం 505 ఎకరాల భూమి మంజూరు?

ఈనాడు మీడియా గ్రూప్ చైర్మన్ రామోజీరావు నిర్మించబోతున్న ‘ఓం సిటీ’ ఆధ్యాత్మిక నగరానికి 505 ఎకరాల భూమిని ఇవ్వడానికి తెలంగాణా ప్రభుత్వం లైన్ క్లియర్ చేసినట్లు తాజా సమాచారం. రెవెన్యూ అధికారులు అందుకు అవసరమయిన ప్రతిపాదనలు అన్ని సిద్దం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపించినట్లు తెలుస్తోంది. ఓం సిటీ నిర్మించేందుకు రామోజీరావు 2,000 ఎకరాల భూమి కావాలని గత ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నారు.

ఆ తరువాత రామోజీరావు ప్రధాని నరేంద్ర మోడిని కలిసి వచ్చేరు. అప్పటి నుండి రామోజీ పట్ల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. అంతవరకు ఆయనను, ఈనాడు మీడియాని ద్వేషిస్తున్న ఆయన స్వయంగా తన మంత్రులను వెంటబెట్టుకొని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఆయనని కలిసి వచ్చేరు. ఆ సందర్భంగా రామోజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ‘ఓం సిటీ’ చిత్రాలు చూపించడం అప్పుడే దానికి అవసరమయిన భూమిని సమకూర్చేందుకు కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం జరిగిపోయాయి. కానీ ఒకే చోట 2000 ఎకరాలు లభించకపోవడంతో, ముందుగా హయత్ నగర్ మండలంలోని కోహెడ, అబ్దుల్లాపూర్ గ్రామాలలో 505 ఎకరాలను రామోజీకి అప్పగించేందుకు అధికారులు అని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అందులో ఆయన రూ.3,000 కోట్ల వ్యయంతో దేశంలో ఉన్న అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాల నమూనాలను నిర్మించాలనుకొంటున్నారు. ఎప్పుడు తెల్లటి బట్టలు ధరించే రామోజీరావు సూటుబూటు వేసుకొని పనిగట్టుకొని డిల్లీ వెళ్లి తమ సంస్థలు చేపడుతున్న స్వచ్చా భారత్ కార్యక్రమాల గురించి, పనిలోపనిగా ఈ ‘ఓం సిటీ’ గురించి ప్రధాని నరేంద్ర మోడికి వివరించి వచ్చేరు. కనుక ఇక దానికి ఎవరి నుంచి అడ్డంకులు ఎదురవకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close