“సెమీ ఫైనల్”కు చేరుకున్న తెలంగాణ రాజకీయాలు !

తెలంగాణ రాజకీయాలు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఇవ్వడం.. ఆయన స్పీకర్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లకముందే ఆమోదం తెలియచేయడం కూడా అయిపోయియి. దీంతో రాజగోపాల్ రెడ్డి మాజీ అయిపోయారు. అందరూ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశారు. నవంబర్‌, డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాలతో పాటు మునుగోడు ఉపఎన్నిక జరికే చాన్స్ ఉంది.

ఉపఎన్నికకు అన్ని పార్టీలు రెడీ అయిపోయాయి. అక్కడ త్రిముఖ పోరు జరగనుంది. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉంటారు. ముఖ్యంగా సీపీఐ పలుమార్లు గెలిచింది. సీపీఐ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచేది. ఇప్పుడు సీపీఐ బరిలో ఉంటుందా లేదా అన్నదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. అక్కడ బీజేపీకి ఎలాంటి బలం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీదే ాధారపడిగెలవాల్సి ఉంది. ఒక వేళ కోమటిరెడ్డి బలం ఏమీ లేక బీజేపీ మూడో స్థానానికో.. అంతకంటే తక్కువతో పడిపోతే.. మాత్రం ఈ ఉపఎన్నిక ద్వారా బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లవుతుంది.

అయితే అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. సెమీస్‌లో గెలిచే పార్టీ ఫేవరేట్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే అన్ని పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. దుబ్బాక.. హుజూరాబాద్ ఎన్నికలు జరిగిన తీరు వేరు.. మునుగోడుకు ఎన్నిక జరుగుతున్న తీరు వేరు. కావాలని తెచ్చి పెట్టుకున్న ఉపఎన్నిక., ప్రజలు ఎలా స్పందిస్తారో కానీ.. రాజకీయ పార్టీలన్నీ మాత్రం రెడీ అయిపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close