సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీ సర్కార్.. కేఆర్ఎంబీకి లేఖ రాసింది. కానీ ఇక్కడ తెలంగాణ సర్కార్ తిరకాసు పెట్టింది. శ్రీశైలంలో ఏపీకి కుడిగట్టు కింద విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ… పోతిరెడ్డి పాడు నుంచి మాత్రం నీళ్లు విడుదల చేయవద్దని లేఖ రాసింది. ఏపీ వాటా కింద విద్యుత్ ఉత్పత్తి చేస్తే.. ఆ నీరు దిగువకు వెళ్తుంది.

అంటే నాగార్జున సాగర్ కు వెళ్తుంది. కానీ రాయలసీమకు వెళ్లదు. రాయలసీమకు వెళ్లాలంటే.. పోతిరెడ్డి పాడు ద్వారా రిలీజ్ చేయాలి. ఇప్పుడు.. శ్రీశైలం నిండింది. గేట్లు ఎత్తారు. కానీ రాయలసీమకు మాత్రం నీళ్లు పంపలేకపోతున్నారు. గేట్లు ఎత్తినా దిగువకు.. అంటే సాగర్‌కే నీరు చేరుకుంది. ఇక్కడే ఏపీ సర్కార్‌కు చిక్కులు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా తమకు పోతిరెడ్డి పాడు నుంచి నీరు విడుదలను పెంచాల్సి ఉంది. కానీ తెలంగాణ అభ్యంతర పెట్టింది. కృష్ణాబేసిన అవసరాలకే అనుమతి ఇవ్వాలని కోరుతోంది.

దీనిపై.. కృష్ణాబోర్డు.. కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల.. నెల రోజుల పాటు చేస్తే కానీ.. పూర్తి స్థాయిలో సీమలో అందుబాటులో ఉన్న సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదు. అనుమతి లేని కారణంగా.. తెలంగాణ అభ్యంతర పెట్టిందన్న కారణంగా … పోతిరెడ్డి పాడు నుంచి నీటి విడుదల ఆపాలని … కేఆర్ఎంబీ ఆదేశిస్తే మాత్రం. ఇబ్బందికర పరిస్థితులు.. సీమ ప్రజలకు ఎదురవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close