సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీ సర్కార్.. కేఆర్ఎంబీకి లేఖ రాసింది. కానీ ఇక్కడ తెలంగాణ సర్కార్ తిరకాసు పెట్టింది. శ్రీశైలంలో ఏపీకి కుడిగట్టు కింద విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ… పోతిరెడ్డి పాడు నుంచి మాత్రం నీళ్లు విడుదల చేయవద్దని లేఖ రాసింది. ఏపీ వాటా కింద విద్యుత్ ఉత్పత్తి చేస్తే.. ఆ నీరు దిగువకు వెళ్తుంది.

అంటే నాగార్జున సాగర్ కు వెళ్తుంది. కానీ రాయలసీమకు వెళ్లదు. రాయలసీమకు వెళ్లాలంటే.. పోతిరెడ్డి పాడు ద్వారా రిలీజ్ చేయాలి. ఇప్పుడు.. శ్రీశైలం నిండింది. గేట్లు ఎత్తారు. కానీ రాయలసీమకు మాత్రం నీళ్లు పంపలేకపోతున్నారు. గేట్లు ఎత్తినా దిగువకు.. అంటే సాగర్‌కే నీరు చేరుకుంది. ఇక్కడే ఏపీ సర్కార్‌కు చిక్కులు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా తమకు పోతిరెడ్డి పాడు నుంచి నీరు విడుదలను పెంచాల్సి ఉంది. కానీ తెలంగాణ అభ్యంతర పెట్టింది. కృష్ణాబేసిన అవసరాలకే అనుమతి ఇవ్వాలని కోరుతోంది.

దీనిపై.. కృష్ణాబోర్డు.. కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల.. నెల రోజుల పాటు చేస్తే కానీ.. పూర్తి స్థాయిలో సీమలో అందుబాటులో ఉన్న సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదు. అనుమతి లేని కారణంగా.. తెలంగాణ అభ్యంతర పెట్టిందన్న కారణంగా … పోతిరెడ్డి పాడు నుంచి నీటి విడుదల ఆపాలని … కేఆర్ఎంబీ ఆదేశిస్తే మాత్రం. ఇబ్బందికర పరిస్థితులు.. సీమ ప్రజలకు ఎదురవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close