నామాకు ఖమ్మం.. జితేందర్ రెడ్డికి నో చాన్స్..! టీఆర్ఎస్ లిస్ట్ ఫైనల్..?

పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ను కేసీఆర్ నేడు ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే అవ‌కాశం ఇచ్చిన గులాబి బాస్ ..ఈ సారి ఎంపీల విష‌యంలో కొత్త అభ్యర్థుల‌ను రంగంలోకి దించ‌బోతున్నారు. సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని కుమారుడికే చాన్సిస్తున్నారు. యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. చేవేళ్ల నియోజ‌క‌వ‌ర్గం పై స‌స్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవ‌ల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కార్తిక్ రెడ్డి లేదా వ్యాపార వేత్త రంజిత్ రెడ్డి కి టిక్కెట్ ఇచ్చే అవ‌కాశాలున్నాయి. పార్టీ మారిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించాలని కేసీఆర్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. మ‌ల్కాజ్ గిరి నియోజ‌క‌వ‌ర్గం లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పోటీలో ఉండ‌టంతో బల‌మైన నేత‌ను రంగంలో దింపాల‌ని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రి మ‌ల్లారెడ్డి అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి లోక‌ల్ గా సుప‌రిచితుడు కావటం … ఆర్థికంగా బలవంతుడు కావడంతో రాజశేఖ‌ర్ రెడ్డికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామా నాగేశ్వర‌రావు ను బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంపై తుమ్మలకు కూడా.. కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదు. వ‌రంగ‌ల్ స్థానానికి సిట్టింగ్ ఎంపి ప‌సునూరి ద‌యాక‌ర్ కు ఈసారి కూడా అవకాశం ఇవ్వబోతున్నారు. క‌డియం శ్రీహ‌రికి ఇస్తార‌ని చ‌ర్చ జ‌రిగినా…స్థానికంగా ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేక‌త వ్యక్తమయింది. మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గంనుంచి సిట్టింగ్ ఎంపి సీతారాంనాయ‌క్ కు కాకుండా మాజీ ఎమ్మెల్యే మాలోత్ క‌విత కు ఇవ్వబోతున్నారు.

పెద్దప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి మాజి ఎంపి వివేక్ ను కేసీఆర్ ఫైన‌ల్ చేశారు. ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ఆయనకే టిక్కెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క‌రీంన‌గ‌ర్ భువ‌న‌గిరి, ఆదిలాబాద్, మెద‌క్, జ‌హీరాబాద్, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపి జితెంద‌ర్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు లేనట్లే. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ యజమానికి మన్నే సత్యనారాయణ రెడ్డి సోదరుడు మ‌న్నె శ్రీనివాస్ రెడ్డిని ఈ స్థానం నుంచి ఎంపిక చేసిన‌ట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి డీ కే అరుణ బీజేపిలో చేర‌డంతో కొత్త సమీకరణాలు పరిశీలిస్తున్న చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close