పఠాన్ కోట్ వంటి దాడులు ఇంకా చాలా చేస్తాము: హఫీజ్ సయీద్

పఠాన్ కోట్ పై దాడికి కుట్ర పన్నినవారెవరో కనిపెట్టేందుకు భారత్ మరిన్ని ఆధారాలు ఇవ్వాలని పాక్ కోరుతోంది. పఠాన్ కోట్ పై దాడికి కుట్ర పన్నినవారిని ఉపేక్షిస్తూ తన ద్వంద వైఖరిని మారో మారుచాటుకొంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ కేంద్రంగా మారిందని భారత్ వాదనలు అది ఖండిస్తుంటుంది. కానీ ఉగ్రవాదులను స్వేచ్చగా దేశంలో తిరగనిస్తుంది. ఆ విషయం పాక్ అంగీకరించకపోయినా కరడు గట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్, పఠాన్ కోట్ పై దాడికి పాల్పడ్డామని చెప్పుకొంటున్న యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ నాయకుడు సయీద్ సల్లాఉద్దీన్ తో కలిసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో బుదవారం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, మున్ముందు పఠాన్ కోట్ వంటి దాడులు ఇంకా చాలా చేయబోతున్నామని ప్రకటించాడు.
దానిపై భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. “హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ లో చాలా స్వేచ్చగా తిరుగ గలుగుతున్నారు. అతను భారత్ పై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాడు. తనకి సహాయ సహకారాలు అందజేసేవారున్నారని బహిరంగానే ప్రకటిస్తున్నాడు. అతని ప్రసంగాలను మీడియాలో ప్రదర్శించకూడదని పాక్ ప్రభుత్వం గత అక్టోబరులో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలను ఎవరూ పట్టించుకొంటున్నట్లు లేదు. యావత్ ప్రపంచ దేశాలు అతనిని ఉగ్రవాదిగా పేర్కొంటున్నాయి. దానిని అతను కూడా స్వయంగా దృవీకరిస్తున్నాడు. అయినా కూడా అతనిని అరెస్ట్ చేయడానికి పాక్ ప్రభుత్వం వెనుకాడుతోంది. అతనిని తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు చేపట్టాలని భారత్ కోరుటోంది,” అని అన్నారు.
కానీ భారత్ చేసే ఇటువంటి విజ్ఞప్తులకు పాకిస్తాన్ స్పందించే మాటయితే ఎప్పుడో ఉగ్రవాదులు అందరినీ అరెస్ట్ చేసేది. ఉగ్రవాదులలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వేరేగా ఉండరని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెపుతుంటారు. కానీ ఉగ్రావాదులలో పాక్ పై దాడులకు పాల్పడేవారు, భారత్ పై దాడులకు పాల్పడేవారు వేరేగా ఉంటారని ఆయన భావిస్తున్నారేమో. అందుకే భారత్ పై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్న హఫీజ్ సయీద్ వంటి వారిని ఉపేక్షిస్తూ పాక్ లో దాడులకు పాల్పడిన వారిపై మాత్రమే అపుడప్పుడు చర్యలు తీసుకొంటూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నటుడు రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతి..కేసు నమోదు

టాలీవుడ్ నటుడు రఘుబాబు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదవశాత్తు బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు వేగంగా ప్రయాణిస్తుండటంతో ప్రమాదం జరిగాక బైక్ ను కారు దాదాపు...

మేనిఫెస్టో మోసాలు : మద్యనిషేధం చేసే ఓట్లడుగుతామన్నారే !

జగన్మోహన్ రెడ్డి తనకు మనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెబుతారు. 99.8 శాతం అమలు చేశానని విచిత్రమన లెక్కలు ప్రకటిస్తూంటారు. కానీ మేనిఫెస్టోను చూస్తే అందులో ఒక్కటంటే ఒక్కటీ...

తెలుగు రాష్ట్రాల్లో నామినేష‌న్లు షురూ…

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి మ‌రింత ప‌దునెక్క‌నుంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ గురువారం నుండి మొద‌ల‌వుతుండ‌టం, మంచి రోజు కావ‌టంతో మొద‌టి రోజే నామినేష‌న్లు భారీగా దాఖ‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీకి, లోక్...

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు…

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ల్యాండ్ క‌బ్జా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జ‌న్యాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసు అధికారుల‌తో క‌లిసి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close