సీమకే శ్రీవారి నిధులు..!

తిరుమల శ్రీవారికి వస్తున్న ఆదాయం మొత్తాన్ని రాయలసీమలోనే ఖర్చు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేస్తున్నారు. తన వాదనకు మద్దతుగా విజయవాడ, సింహాచలం ఆలయాల డబ్బు ఆ ప్రాంతాలకే ఖర్చు చేయాలని కూడా.. అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యేకంగా సీమ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తూండటంతో… టీజీ వెంకటేష్.. మరింత అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. ఆయన కొంచెం దూకుడుగానే రాయలసీమ అంశాలను మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ ఇప్పుడు.. సీమ విషయంలో… ప్రత్యేకంగా ఉండటంతో.. దాన్ని టీజీ వెంకటేష్ మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా సీమలో హక్కుల సంఘాలు, ఉద్యమ సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి.

రాయలసీమ నీళ్లను ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని… కూడా టీజీ వెంకటేష్ అంటున్నారు. గోదావరి జలాలు కృష్ణా ప్రాంతానికి ఇచ్చి.. రాయలసీమకు రావాల్సిన నీళ్లను ఇస్తామని నాడు వైఎస్ చెప్పారని.. కానీ ఇంత వరకు అమలు కాలేదని అంటున్నారు. కేంద్రం నిధులతో ప్రాజెక్టులను స్పీడ్ బ్రేకర్లు లేకుండా పూర్తి చేయాలని.. అలా చేస్తేనే సీమకు నీళ్లొస్తాయని ఆయనంటున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి.. తన మేనిఫెస్టో ప్రకారం.. పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్నారని.. ఆదాయం మొత్తం అక్కడే ఖర్చయిపోతోందంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని విషయంలో టీజీ వెంకటేష్.. కొన్ని కీలకమైన వ్యాఖ్యలను కొద్ది రోజులుగా చేస్తున్నారు. జగన్ నాలుగు రాజధానులు చేయబోతున్నారన్న ప్రచారాన్ని ఆయనే ప్రారంభించారు. అయితే.. ఆ తర్వాత వాటిని ప్రాంతీయ బోర్డులుగా మార్చారు. ఇప్పుడు.. ప్రాంతీయ బోర్డు డిమాండ్ ను బీజేపీ అందుకుంది. ప్రాంతీయబోర్డులను ఏర్పాటు చేసి.. రూ. 20వేల కోట్లను రాయలసీమకు కేటాయించాలన్న డిమాండ్ ను వినిపిస్తున్నారు. అదే సమయంలో.. అమరావతి ఫ్రీజోన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ సీమ వాదంలో.. మరో ప్రత్యేకమైన వాదాన్ని టీజీ వెంకటేష్ మరింత జోరుగా ముందు ముందు వినిపించే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close