నిమ్మగడ్డ దూకుడు వైఎస్ ఇచ్చిన ధైర్యంతోనేనట..!

ఎన్నికల వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్చను వైఎస్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పని చేయడం తన జీవితంలో కీలక మలుపన్నారు. వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని, కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారన్నారు. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదన్నారు. ఆయన దగ్గర పని చేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబు సమయంలో ఎప్పుడూ ప్రాధాన్యత పోస్టులు దక్కించుకోలేదు. వైఎస్ హయాంలోనే ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా కీలకంగా వ్యవహరించారు. అంతకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా… ప్రధాన పోస్టులుగా పేర్కొనదగ్గ వాటిని ఆయన పొందలేకపోయారు. కారణం ఏమిటో స్పష్టత లేదు కానీ… ఆయన ఎస్‌ఈసీగా నియమితులు కావడానికి కూడా గవర్నర్ నరసింహన్ కారణం. రాజ్‌భవన్ కార్యదర్శిగా నిమ్మగడ్డ ఆరేడేళ్ల పాటు పని చేశారు. రిటైరైన తర్వాత ఎస్‌ఈసీ పదవిని నరసింహనే ఇప్పించారు. చంద్రబాబు బిశ్వాల్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరును రెండు సార్లు సిఫార్సు చేసినా నరసింహన్… తిప్పి పంపి.. నిమ్మగడ్డనే ఖరారు చేయించారు. అలా తనకు రాజ్‌భవన్ వల్లనే ఎస్‌ఈసీ పదవి వచ్చిందని నిమ్మగడ్డ నిర్మోహమాటంగా చెబుతున్నారు

అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. వైఎస్ కుమారుడు.. ఆయన పార్టీ నేతలు ఆయనను కులం పేరుతో దూషిస్తున్నంత పనిచేస్తున్నారు. తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అయితే.. నిమ్మగడ్డ మాత్రం వాటిని రాజ్యాంగ బద్ధంగా డీల్ చేసుకుంటూ.. తన పనితాను చేసుకుపోతున్నారు. ఆయన ఏం జరిగినా సరే తన విధుల్ని తాను పక్కాగా నిర్వహించాలని అనుకుంటున్నట్లుగాకనిపిస్తోంది. ఈ విషయంలో నిమ్మగడ్డ కూడా వైఎస్‌నే ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని వైసీపీ నేతలు గొణుక్కుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close