ఈసీ సందేశం : ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడల్లా లేదు…!

ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడల్లా లేదని కేంద్ర ఎన్నికల సంఘం డైరక్ట్ సమాచారాన్ని రాజకీయ పార్టీలకు పంపింది. ఉపఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలని ఎన్నికల సంఘం లేఖలు రాసింది. ఈ లేఖలు అందుకున్న రాజకీయ పార్టీలు ఖంగుతున్నాయి. ముఖ్యంగా ఉపఎన్నికల బరిలో ఉన్న పార్టీలు షాక్ తిన్నాయి. ఎందుకంటే నేడో రేపో ఉపఎన్నికల షెడ్యూల్ వస్తుందని రంగంలోకి దిగి.. అభ్యర్థులను ఖరారు చేసుకుని ప్రచారబరిలో రోజూ భారీ ఎత్తున ఖర్చుపెట్టుకుంటూంటే.. ఇప్పుడు ఎన్నికలపై అభిప్రాయం చెప్పమనడం ఏమిటనేదే ఆ రాజకీయ పార్టీలకు అర్థం కాని విషయం.

పైగా అభిప్రాయాలు చెప్పడానికి ఈసీ ఇచ్చినగడువు కూడా ఆగస్టు నెలాఖరు వరకు ఉన్నది. అంటే.. ఆ గడువు వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరన్నమాట. పూర్తి స్థాయిలో అభిప్రాయాలు సేకరించి… నిర్ణయం తీసుకునే సరికి సెప్టెంబర్ సగం అవుతుంది. ఆ తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే.. ఎలాలేదన్న నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే మరో నెల తర్వాతే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఇప్పుడల్లా ఎన్నికలు వద్దన్న సందేశాన్ని పరోక్షంగాపంపించారు.

ఎమెల్సీ ఎన్నికలు నిర్వహించవద్దని .. ఇది మంచి సమయం కాదని ఈసీకి వివరించారు. తర్వాత కూడా ఇదే అభిప్రాయంతో ఉంటే… ఉపఎన్నికలపై ఈసీ వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ఎలాగూ ఐదురాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాల్సిందేకాబట్టి… వాటితో పాటు ఉపఎన్నికలు పెట్టే ఆలోచన ఎన్నికల సంఘం చేసే అవకాశం ఉంది.ఈ లెక్కలను బేరీజు వేసుకుంటే.. హుజూరాబాద్‌లో రాజకీయా పార్టీలకు ఆయాసం తప్ప ఇప్పుడల్లా పోరాటం ఉండే అవకాశం లేదన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close