టీటీడీ చైర్మన్‌కు అమరావతిలో క్యాంప్ ఆఫీస్‌ ఎందుకో..?

తిరుమల తిరుపతి దేవస్థానాలకు చైర్మన్‌గా నియమితులైన.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి.. వై.వి.సుబ్బారెడ్డి వ్యవహారశైలి రాను రాను వివాదాస్పదంగా మారుతోంది. ఇంత వరకూ.. చైర్మన్ ఒక్కరే పాలకమండలికి ఉన్నారు. సభ్యుల నియామకం పూర్తి కాలేదు. ఈ కారణంగా.. ఆయనకు ఎలాంటి అధికారాలు ఇంకా దఖలు పడినట్లుకాదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. పాలక మండలి అనుమతితోనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహిత బంధువు కావడం… ప్రభుత్వంలో చక్రం తిప్పే వ్యక్తుల్లో ఒకరు కావడంతో.. ఆయన మాటలకు ఎదురు చెప్పే పరిస్థితి లేకపోయింది. ఈ క్రమంలో ఆయన కోసం.. ఆయన చేయమని ఆదేశించిన పనులు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అమరావతిలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం.

టీటీడీ చైర్మన్‌గా ఎంత పెద్ద వ్యక్తి ఉన్నప్పటికీ… వారి కార్యకలాపాలు… కేవలం తిరుమలకే పరిమితమవుతాయి. రాజధాని అమరావతిలో ఉండి నీ.. టీటీడీ చైర్మన్ చేసేదేమీ ఉండదు. అందుకే.. ఇంత వరకూ ఏ టీటీడీ చైర్మన్ కూడా రాజధానిలో క్యాంపాఫీస్ అనే ఆలోచన చేయలేదు. కానీ సుబ్బారెడ్డి మాత్రం.. రాగానే తిరుమలో తన క్యాంపాఫీస్‌గా.. తను తన భార్య పేరు మీద నిర్మించిన కాటేజ్‌నే… ఎంచుకున్నారు. అక్కడ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా.. అమరావతిలోనూ.. టీటీడీ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కూడా.. ఆరుగురు ఉద్యోగులతో… చైర్మన్ క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇది..ఇతర రాజకీయ నాయకులనే కాదు భక్తులను కూడా విస్మయానికి గురి చేస్తోంది.

టీటీడీ చైర్మన్ కు అమరావతిలో క్యాంప్ ఆఫీస్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి బాబాయిగా.. వైవీ సుబ్బారెడ్డి… ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ కాలం అమరావతిలోనే ఉంటారు కాబట్టి.. ఈ ఏర్పాటని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడే ఇన్ని వివాదాలు వస్తున్నాయి.. మరి పాలక మండలి ఏర్పాటైతే సభ్యులు కూడా.. తమ తమ రాష్ట్రాల్లో క్యాంప్ ఆఫీసులు కావాలని కోరుకుటారేమో..? కొసమెరుపేమిటంటే… భక్తుల సౌకర్యం కోసమే అమరావతిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నానని వైవీసుబ్బారెడ్డి చెబుతున్నారు. అంటే.. అ క్యాంప్ ఆఫీస్.. చైర్మన్ కోసం కాదు.. భక్తుల కోసమేనన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close