ముగ్గురు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ చర్చలు..!

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ నాయకులు.. మరో అడుగు ముందుకేశారు. ఆపరేషన్ ప్రకాశం జిల్లాను దాదాపుగా పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలను.. నయానో.. భయానో… వైసీపీలో చేరేందుకు ఒప్పించారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ పరువు నిలిపిన మొదటి జిల్లా ప్రకాశం. ఆ జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగింటిలో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. మరే జిల్లాలోనూ.. నాలుగు స్థానాలు రాలేదు. ఈ నలుగురిలో.. కనీసం ముగ్గురిని తమ పార్టీలో చేర్చుకోవాలని… వైసీపీ నాయకత్వం.. కొన్నాళ్లుగా స్కెచ్ వేసింది.

ముందుగా కొంత మందితో చర్చలు జరిపిన.. వైసీపీ నేతలకు.. సానుకూల స్పందన రాలేదు. దాంతో.. అధికారం ప్రయోగించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను టార్గెట్ చేసి.. ఆయన వ్యాపారాలపై విజిలెన్స్ ను ప్రయోగించారు. గ్రానైట్ వ్యాపారంలో ఆయన ఉండటంతో.. ఆయన క్వారీల్లో.. నెల రోజులుగా.. అధికారులు..మకాం వేసి.. సోదాల పేరుతో… కాలక్షేపం చేస్తున్నారు. ఆయన పార్టీలో చేరుతానని గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే.. అవి ఆగుతాయని.. సూచనలు పంపారు. ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతోనూ వైసీపీ నేతలు చర్చలు జరిపారంటున్నారు. ఆయనకు ఉన్న వ్యాపార అవసరాలు.. ఇతర కారణాలతో.. ఆయనతోనూ.. చర్చలు ఫలప్రదం అయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఇంకో విశేషం.. ఏమిటంటే.. ఈ జాబితాలో … చీరాల ఎమ్మెల్యే  కరణం బాలకృష్ణమూర్తి పేరును కూడా వైసీపీ నేతలు తెరపైకి తీసుకు వచ్చారు. ఆయననూ ఆహ్వానించామని.. ఆయన కూడా.. సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. కానీ.. గొట్టిపాటి, కరణం … ఇద్దరూ వైసీపీలో చేరడం అయితే.. కష్టమని ప్రకాశం రాజకీయాలపై అవగాహన ఉన్న వాళ్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి.. వైసీపీ నేతలు.. ఆపరేషన్ ప్రకాశంను.. దాదాపుగా పూర్తి చేశారని అంటున్నారు. నేడో..రేపో.. ఆ ఎమ్మెల్యేలు సీఎంను కలుస్తారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close