క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై సరైన సమయంలో చర్యలు : సజ్జల

వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించామని కానీ వెంటనే చర్యలు తీసుకోబోమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇదేమీ ఉద్యోగం కాదని రాజకీయమని చెప్పుకొచ్చారు. తప్పు చేశారని తెలిసిన తర్వాత కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేనంత దుర్భర పరిస్థితికి వైసీపీ వెళ్లిపోవడం ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.

మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓట్లు వేశారు. ఆ నలుగురిలో ఇద్దరు బహిరంగంగా పార్టీని ధిక్కరించారు. మరో ఇద్దరు ఎవరనేది తెలుసుకునే ఉంటారు. ఆ నలుగుర్ని సస్పెండ్ చేయడం లేదా.. పార్టీ నుంచి బహిష్కరించడం ఇంకా చెప్పాలంటే అనర్హతా వేటు వేసే అధికారం కూడా వైసీపీ చేతుల్లో ఉంది. కానీ ఏ చర్యా తీసుకోలేకపోతున్నామని సజ్జల చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉందని గెలుక్కుంటే.. మొదటికేమోసం వస్తుందని ఆయన భావిస్తున్నట్లుగా ఉన్నారు.

ఈ పరిణామాలపై వైఎస్ఆర్‌సీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలపై సీఎం జగన్ పట్టు కోల్పోయారా అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఓటమిపై ఇంకా వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామనుకున్న ఎమ్మెల్సీ సీట్లలో ఓడిపోవడంతో వైసీపీ క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఐదుగురు ఓట్లేసినా తమ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ చేయడం వారిని ఇబ్బంది పెడుతోంది. తమ పరిస్థితి అయిపోయిందన్న అభిప్రాయానికి వైసీపీ నేతలు వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close