తెలుగు సినిమా జోరు, బాలీవుడ్ బేజారు

కథాబలం సంగతి ఎలా ఉన్నా, బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడంలో టాలీవుడ్ కొత్త రికార్డులు తిరగరాస్తుంది. కలెక్షన్లే ప్రాతిపదిక అయితే గనక, మన ముందు బాలీవుడ్ బలాదూర్. వట్టి అభిమానంతో చెప్పే మాట కాదండోయ్. పక్కా లెక్కులున్నాయ్, చూడండి.

అమెరికాలో గత వీకెండ్ కలెక్షన్స్ లో తెలుగు సినిమాలు దుమ్మురేపాయి. వీటి ముందు హిందీ సినిమాలు డంగైపోయాయి. కిక్ 2 అయితే అమెరికా బాక్సాఫీస్ లో మోత మోగించింది. గత వీకెండ్ కలెక్షన్ లిస్టులో కిక్ 2 ఏకంగా 28వ ర్యాంకులో నిలిచింది. 3,07,195 డాలర్లు వసూలు చేసిందట. అంటే భారతీయ కరెన్సీలో 2 కోట్ల రూపాయలకు పైనే. మొదటి వారాంతంలో ఇదీ కిక్ 2 స్టామినా. మొత్తం 99 స్క్రీన్లపై ఈ సినిమా ఆడుతోంది.

ఇక మహేష్ బాబు శ్రీమంతుడు 38వ ర్యాంకు సాధించాడు. ఈ సినిమా 94,498 డాలర్లు వసూలు చేసింది. అంటే 62 లక్షల రూపాయలకు పైమాటే. శ్రీమంతుడు 46 స్క్రీన్లలో ఆడుతున్నాడు.

బాలీవుడ్ సంగతి చూస్తే, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బ్రదర్స్ సినిమా 42వ ర్యాంకుకు పరిమితమైంది. 60,694 డాలర్లు, అంటే 40 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసిందట. ఇక బజ్రంగీ భాయిజాన్ వగైరా సినిమాలన్నీ నామమాత్రం కలెక్షన్లు సాధించాయని ట్రేడ్ వర్గాల సమాచారం. అమెరికా కలెక్షన్లలోనూ తెలుగు సినిమాలు బాలీవుడ్ తో పోటీ పడటమే కాదు, అధిగమించడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close