టాలీవుడ్ టీంకు అమరావతి రైతుల సెగ..!

ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశానికి వచ్చిన టాలీవుడ్ ప్రముఖులకు అమరావతి రైతుల సెగ తగిలింది. విజయవాడ వచ్చిన సినీ ప్రముఖులు నేరుగా కరకట్టపై ఉన్న పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. మొదట్లో వారంతా.. విజయవాడలోని స్టార్‌హోటల్‌కు వెళ్తారని అనుకున్నారు. కాని గోకరాజు గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. వీరు వస్తున్న విషయం తెలిసిన రాజధాని రైతులు.. మహిళలు పెద్ద ఎత్తున కరకట్ట వద్దకు వచ్చారు. చిరంజీవి బృందం బస చేసిన గెస్ట్‌హౌస్‌ ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

మూడు రాజధానులు వద్దు రాజధానే ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేశ్‌బాబు సహా పలువురు ప్రముఖులు ఈ బృందంలో ున్నారు. అమరావతి అభివృద్ధే భవిష్యత్తుకు ఉషోదయమని వారు నినాదాలు చేశారు. అనూహ్యంగా రైతులు.. మహిళలు రావడంతో… పోలీసులు అప్రమత్తమయ్యారు. సినిమా ప్రముఖులు అమరావతినే రాజధానిగా కొనసాగించమని జగన్‌కి ఒక్క మాట చెప్పాలని అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ నేత సుంకల పద్మశ్రీ డిమాండ్ చేశారు. మీరు రీల్ లైఫ్ హీరోస్‌ మాత్రమే కాదు.. రియల్‌ లైఫ్‌ హీరోస్‌ అని రుజువు చేసుకోవాలని సవాల్ చేశారు.

అమరావతి రాజధాని ఒక్క రైతులదే కాదు.. మన అందరిదని రాజధాని మీ బాధ్యత కాదా అని పద్మశ్రీ ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతన్నను సినీ పెద్దలు ఆదుకోవాలన్నారు. రైతుల దగ్గర సినీ ప్రముఖులు వినతి పత్రం తీసుకుంటారని.. వారితో కొంత సేపు మాట్లాడతారని అనుకున్నారు కానీ.. అలాంటి చాన్స్ రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్‌కు వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close