కామారెడ్డిలో కేసీఆర్‌కు అంత తేలిక కాదు !

కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. దీంతో రేవంత్ రెడ్డితో కేసీఆర్‌కు హైవోల్టేజ్ పోరు జరగనుంది. కామారెడ్డిలో కేసీఆర్‌కు అంత తేలిక కాదన్న వాదన ముందు నుంచీ ఉంది. కేసీఆర్ సీఎం … ఆయన స్టేట్ లీడర్ అనే క్రేజ్ తో ఓట్లు వేసేస్తారని బీఆర్ఎస్ అనుకోవచ్చు కానీ.. పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. రేవంత్ రెడ్డిలాంటి బ లమైన ప్రత్యర్థి ఉంటే… . టఫ్ ఫైట్ ఉంటుంది.

కామారెడ్డిలో బీఆర్ఎస్ ఎప్పుడూ అంత బలంగా లేదు. ఉద్యమం అత్యంత తీవ్రంగా ఉన్న సమయంలో .. ఇతర చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులుక ఏకపక్షంగా యాభై వేల ఓట్ల మెజార్టీ వచ్చిన సందర్భాల్లోనూ కామారెడ్డిలో బీఆర్ఎస్‌ గట్టిపోటీ ఎదుర్కొంది. స్వల్ప తేడాతోనే విజయాలు సాధించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యం లభించింది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2019లో మదన్ మోహన్ రావు పోటీ చేశారు. ఆయన కు కామారెడ్డివో 65679 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు కేవలం 49258 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఏకంగా పదహారు వేల ఓట్ల తేడా ఉంది.

అదే సమయంలో కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ సహా అనేక సమస్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వచ్చాయి. రైతులు తీవర్ ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్‌పై నామినేషన్ వేస్తామని ఇప్పటికే వంద మంది రైతులు ప్రకటించారు. గతంలోలా ఇప్పుడు సెంటిమెంట్ పవనాలు లేవు. బీఆర్ఎస్ పై పోటీ చేయడం తెలంగాణపై కుట్ర అంటే.. నమ్మే స్టేజ్ దాటిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు ఎదురైన సమస్యల్నే ఎక్కువగా గుర్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కామారెడ్డిలో హై వోల్టేజ్ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారం ముగిసింది – 30న అసలు యుద్ధం !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అసలు ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకూ ప్రచారంలో ముందు మేమున్నామంటే.. మేమున్నాని చెప్పుకునేందుకు జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేసిన పార్టీలు.. ఇప్పుడు అసలు యుద్ధం ప్రారంభించాయి....

మరో ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు జైలు శిక్ష – సిగ్గు రాదా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకాల గురించి గ్రంధాలు రాసినా తరగనంత సాహిత్యం పోగుపడిపోయింది. కోర్టుల దగ్గర ఉన్న ధిక్కార పిటిషన్లను లెక్కేసుకోవడానికి ఐదేళ్లు చాలవు. అతి కష్టం మీద తీర్పు వచ్చినా వాటిని అమలు...

ఏపీ సర్కార్ వారి డేటా ఎనలిటికల్ యూనిట్ – పెద్ద ప్లానే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డేటా ఎనలిటికల్ యూనిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం డేటా ఎనలటిక్స్ చేస్తుందంటే... ఆదాయమంట. ఆదాయం ఎక్కడ తగ్గిపోయిందో గుర్తించి పెంచడానికి ఈ యూనిట్...

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close