టీ-పబ్లిక్ సర్వీస్ కమీషన్ మొట్ట మొదటి నోటిఫికేష్ విడుదల

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటుచేసిన తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ మొట్టమొదటి ఉద్యోగ నోటిఫికేషన్ బుదవారం విడుదలయ్యింది. మొదటి విడతలో వివిధ ప్రభుత్వ శాఖలలో 770మంది సివిల్ ఇంజనీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలయింది. మరొక విశేషం ఏమిటంటే ఈ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 44సం.లుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వచ్చే నెల 20న వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్నులయిన వారికి ఆ తరువాత వెంటనే ఇంటర్వ్యూ మెడికల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్నులకు నియామక పత్రాలు అందజేసి ఉద్యోగాలలోకి తీసుకొంటారు. ఈ పోస్టుల భర్తీకి పరీక్ష వివరాలు వగైరా అన్నీ కమీషన్ తాలూకు వెబ్ సైట్ లో పెట్టామని చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. దీని తరువాత గ్రూప్-2 పోస్టుల భర్తీకి అక్టోబరులో, గ్రూప్-1కి డిశంబరులో నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది డిశంబర్ నాటికి మొత్తం 3,783 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ లో వివిధ శాఖలలో భర్తీ చేయబోయే స్థానాలు ఈవిధంగా ఉన్నాయి. ఆర్.డబ్ల్యు.ఎస్-418 పోస్టులు, నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి-143, పబ్లిక్ హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజనీరింగ్-121, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 83, మున్సిపల్-5 పోస్టులు కలిపి మొత్తం 770 పోస్టులను మొదటి దశలో భర్తీ చేయబోతున్నట్లు ఘంటా చక్రపాణి తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close