చిరు ప‌క్క‌న త్రిష‌… చూడ‌గ‌ల‌మా?

చిరంజీవి 152వ సినిమాలో క‌థానాయిక‌గా త్రిష పేరు దాదాపుగా ఖాయ‌మైపోయింది. న‌య‌న‌తార‌, అనుష్క, త‌మ‌న్నా లాంటి పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చినా – కొర‌టాల మాత్రం త్రిష వైపుకు మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది. న‌య‌న ఇది వ‌ర‌కే చిరుతో జోడీ కట్టింది. పైగా న‌య‌న కాల్షీట్లు దొర‌క‌డం చాలా క‌ష్టం. పారితోషికం కూడా బాగా డిమాండ్ చేస్తోంది. ఇక త‌మ‌న్నా ఇప్ప‌టికే `సైరా`లో చిరు ప‌క్క‌న క‌నిపించింది. అనుష్క కాల్షీట్ల కోసం కొంత కాలం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఈ ద‌శ‌లో త్రిష అయితే అన్ని విధాలుగా బాగుంటుంద‌ని కొర‌టాల భావిస్తున్నాడు.

అయితే చిరు – త్రిష అన‌గానే ‘స్టాలిన్’ గుర్తొస్తుంది. అందులో చిరు బాగా లావుగా, త్రిష మ‌రీ స‌న్న‌గా క‌నిపించింది. చిరు జోడీల్లో కాస్త ఇబ్బందిగా క‌నిపించిన సంద‌ర్భం ఇదే. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ప‌రిస్థితుల్లో పెద్ద‌గా మార్పేమీ రాలేదు. చిరు అలానే లావుగా ఉంటే, త్రిష మ‌రింత స‌న్న‌బ‌డింది. సో.. ఇప్ప‌టికీ ఈ కాంబో ఆర్డ్ గానే ఉంటుంది. కానీ కొర‌టాల శివ ముందు మ‌రో ఆప్ష‌న్ లేకుండా పోయింది. చిరంజీవికి క‌థానాయిక‌గా త్రిష‌ని ఎంపిక చేసుకోవ‌డం అంత‌గా ఇష్టం లేద‌ని, అయితే కొర‌టాల నిర్ణ‌యాన్ని చిరు గౌర‌వించ‌డం వ‌ల్ల ఈ కాంబో మ‌రోసారి తెర‌పైకి రాబోతోంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. మ‌రి ఈసారి.. ఈ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close