మ‌హేష్ బాబు – సందీప్ రెడ్డి.. సినిమా లేన‌ట్టే!

అర్జున్ రెడ్డి త‌ర‌వాత సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయాల‌ని చాలామంది స్టార్ హీరోలు భావించారు. అందులో మ‌హేష్ బాబు ఒక‌డు. మ‌హేష్ – సందీప్ మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. వీరిద్ద‌రి కాంబో దాదాపుగా ఖాయ‌మ‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే ఈ కాంబో ఇక లేన‌ట్టే. సందీప్ రెడ్డితో సినిమా చేయాల‌న్న ఆలోచ‌న మ‌హేష్ విర‌మించుకున్న‌ట్టు తెలుస్తోంది. దానికి కార‌ణం.. క‌థేన‌ట‌.

సందీప్ చెప్పిన క‌థ మ‌హేష్‌కి న‌చ్చింది గానీ, ద్వితీయార్థంలో కొన్ని అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ట్టు టాక్‌. సందీప్‌రెడ్డి ది కాస్త మొండి వైఖ‌రి. ఎవ‌రి కోస‌మో క‌థ మార్చుకోడు. అర్జున్ రెడ్డి క‌థ‌ని కూడా చాలామంది హీరోలు తిర‌స్క‌రించారు. అందులో మార్పులు చేర్పులు చెప్పారు. ఎవ‌రి మాట‌కూ త‌లొగ్గ‌క‌… తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టు తీయ‌డానికి ఆ సినిమా కోసం తానే నిర్మాత‌గా మారాడు. అందుకే అంత‌టి స‌క్సెస్ వ‌చ్చింది. అర్జున్ రెడ్డి హిట్ట‌వ్వ‌డం, అది బాలీవుడ్ లో తెర‌కెక్కించి దాన్ని కూడా సూప‌ర్ హిట్ చేయ‌డంతో సందీప్ రేంజు మ‌రింత పెరిగింది. ఇలాంటి స్థితిలో హీరో కోసం క‌థ‌ని మార్చేందుకు సందీప్ ఎందుకు ఒప్పుకుంటాడు? అందుకే… ఈ ప్రాజెక్టు నుంచి సందీప్ కూడా త‌ప్పుకున్నాడు. సందీప్‌తో సినిమా స్థానంలో ప్ర‌శాంత్ నీల్ (కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు)ని తీసుకొచ్చాడు మ‌హేష్‌. పైగా ఇప్పుడు సందీప్ కి తెలుగు సినిమాలు చేయాల‌ని కూడా లేదు. త‌న దృష్టంతా బాలీవుడ్‌పైనే ఉంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close