టీఆర్ఎస్ – బీజేపీ లడాయి వెనుక “ప్లాన్ బీ” ఉందా..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. కేసీఆర్‌పై .. ఓ రేంజ్‌లోనే విమర్శల వర్షం కురిపించారు. “తెలంగాణను కాపాడేది నువ్వా “..అంటూ.. కేసీఆర్ పైనా ఫైరయ్యారు. ఆ తర్వాతి రోజు అంటే.. ఆదివారం… అమిత్ షా వ్యాఖ్యలపై ఇతర నేతలెవరూ స్పందించలేదు కానీ.. ఒక్క కేటీఆర్‌ మాత్రం ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. గుజరాత్‌లోముందస్తుకు మోడీ వెళ్లలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో అసలు బీజేపీ లేదని..తమకు కాంగ్రెస్‌తోనే పోటీ అని తేల్చారు. రెండు పార్టీల నేతల విమర్శలు చూస్తే..తీవ్రంగా పోరాడేసుకుంటున్నారని సామాన్యులు అనుకుంటున్నారు కానీ… మహాకూటమి ఎఫెక్ట్‌తో “ప్లాన్ బీ” అమలు చేస్తున్నారన్న విశ్లేషణలు మాత్రం ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

తెలంగాణలో విపక్ష పార్టీలన్నీ మహాకూటమిగా అవతరించాయి. ఇప్పుడు పోటీ.. టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి అన్నట్లుగా… ద్విముఖ పోటీగా మారిపోయింది. ఇదే జరిగితే.. ఓట్లన్నీ.. రెండు వైపుల మాత్రమే పోలరైజ్ అవుతాయి. ఇది అధికార పార్టీకి చాలా నష్టం చేకూరుస్తుంది. అధికార వ్యతిరేక ఓట్లు ఎంత ఎక్కువగా చీలితే… టీఆర్ఎస్‌కు అంత లాభం. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితి తీసుకు రావడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. 2019లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే దక్షిణాదిలో మద్దతుగా నిలిచే పార్టీలు ఎక్కువగా సీట్లు సాధించాలి. అలాంటి మద్దతు తామిస్తారని.. టీఆర్ఎస్ హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు జరిగితే.. ఐదారు నెలల తేడాతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని.. ఆ మేరకు బీజేపీకి మద్దతు పెరుగుతుందన్న నమ్మకాన్ని టీఆర్ఎస్ అధినేత బీజేపీ అగ్రనేతలకు కల్పించారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ఓడిపోవాలని బీజేపీ కోరుకుంటోంది. అదే సమయంలో టీఆర్ఎస్ గెలవాలనుకుంటోంది. అలా జరగాలంటే.. కాంగ్రెస్ కూటమికి వచ్చే ఓట్లను చీల్చాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలి. దాని వల్ల టీఆర్ఎస్ లాభపడుతుంది. దీని కోసమే బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై దాడి ప్రారంభించారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న వాతారవణం కల్పించడం ద్వారా… కాంగ్రెస్ కు వచ్చే కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చవచ్చనేది అసలు టార్గెట్. ఈ లక్ష్యంలో టీఆర్ఎస్ , బీజేపీ రెండు పార్టీలకు ఉపయోగం. మహాకూటమితో ఓట్లు పోలరైజ్ అవుతున్న సమయంలో.. ఈ “ప్లాన్‌ బీ”ని చాలా చాకచక్యంగా అమలు చేసే ఉద్దేశంలో బీజేపీ, టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close