కవిత ఆశలు అడియాశలేనా!

హైదరాబాద్: ఎప్పుడెప్పుడు కేంద్రమంత్రి అవుదామా అని ఉవ్విళ్ళూరుతున్న టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆశలు అడియాశలుగానే మిగిలిపోయేటట్లున్నాయి. కేంద్రంపట్ల తటస్థవైఖరిని అవలంబించిన టీఆర్ఎస్, అకస్మాత్తుగా స్వరం పెంచింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష ఉపనేత వినోద్ నిన్న చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఏడాదిపాటు ప్రజలు నరేంద్రమోడిని విశ్వసించారని, కానీ ఇప్పుడు ఆ నమ్మకం క్రమంగా కోల్పోతున్నారని వినోద్ వ్యాఖ్యానించారు. ముగ్గురు కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, దీనిపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన విషయాలలోనూ ప్రధాని వైఖరితో తాము విశ్వాసం కోల్పోతున్నామని అన్నారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకూ వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నవిషయాన్ని గుర్తు చేస్తూ, దీనిపై రెండునెలల్లో హైకోర్టు విభజన చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, నేటికీ అది ఆచరణ దాల్చలేదని చెప్పారు. ప్రధాని మోడి చంద్రబాబును బతికించేందుకు ప్రయత్నిస్తున్నారని వినోద్ ఆరోపించారు. అటు తెలంగాణ దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికూడా మోడి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి చూపిస్తోందని ఆరోపించారు. మొత్తంమీద చూస్తే కేంద్రం విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఘర్షణపూరితంగానే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తే టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశాలు మృగ్యమని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మరి కేంద్రమంత్రి కావాలని కలలు కంటున్న కవిత ఆశలు అడియాశలుగానే మిగిలిపోయేటట్లున్నాయి…పాపం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close