బెయిల్‌‌రద్దుకు ‘సుప్రీం’ నిరాకరణ: కేసీఆర్‌కు చెంపపెట్టని టీడీపీ వ్యాఖ్య

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో వాదించటంకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రఖ్యాత న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్‌ను తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ కేసులో ఇంకా సాక్షులను విచారించాల్సిఉందని సిబల్ వాదించారు. అరెస్టయిన ఒక్కరోజులో బెయిల్ వస్తే పరిశీలించాలని, కానీ నిందితుడు 30 రోజులు జెయిల్‌లో ఉన్నాడని న్యాయమూర్తి అన్నారు. సెక్షన్ 164కింద వాంగ్మూలం రికార్డ్ చేశారనికూడా గుర్తు చేశారు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని పేర్కొన్నారు. రేవంత్ తరపున మరో ప్రముఖ న్యాయవాది రాంజెత్మలాని వాదించారు.

మరోపైపు రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయటం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టని తెలుగుదేశం తెలంగాణ నేత రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు అన్ని కార్యక్రమాలూ నిలిపేసి రేవంత్ రెడ్డి కేసును సింగిల్ పాయింట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close