మరోసారి టీఆర్ఎస్ ప్లీనరీ !

టీఆర్ఎస్ ఆవిర్భావఉత్సవాలు సాదాసీదాగా జరగనున్నాయి. 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ను ప్రకటించారు కేసీఆర్. ఈ ఏడాదికి 21 ఏళ్లు అవుతుంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి మాత్రం గత అక్టోబర్‌లోనే ప్లీనరీ నిర్వహించేశారు. ఓ బహిరంగసభ నిర్వహిద్దామనుకున్నా కుదరలేదు. ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నారు.

రాష్ట్ర మంత్రి వర్గం, ఎంపీల దగ్గర్నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ల వరకూ పదవుల్లో ఉన్న వారు… ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు. వారితోనే ప్లీనరీ నిర్వహిస్తారు. ప్లీనరీలో పదకొండు తీర్మానాలు పెట్టి ఆమోదిస్తారు. కేసీఆర్ ప్రసంగిస్తారు. అయితే హుజురాబాద్ ఉపఎన్నికలకు ముందే హెచ్‌ఐసీసీలోనే ప్లీనరీ నిర్వహించారు. మరోసారి నిర్వహిస్తున్నారు. ఈ సారి ఆవిర్భావ దినోత్సవానికి బహిరంగసభ పెడతారేమో అనుకున్నారు. గతంలో “దేశం మొత్తం తిరిగి చూసే” సభను నిర్వహించాలని ప్రయత్నించారు. కానీ వివిధ కారణాలతో వాయిదాలు పడింది.

అయితే “దేశం మొత్తం తిరిగి చూసే” సభను మాత్రం నిర్వహిస్తారని.. అది ఎప్పుడు అనేది కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు సాదాసీదా ప్లీనరీ .. పార్టీ నేతల జెండాల ఆవిష్కరణతోనే సరిపెట్టబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close