ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆరు స్థానాలు కైవసం చేసుకొన్న తెరాస

ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార తెరాస పార్టీ ఇంతవరకు ఆరు సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకొంది. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఒక్కొక్క సీటు, కరీంనగర్ లో రెండు సీట్లు గెలుచుకొంది. ఆ జిల్లాలలో పోటీలో ఉన్న తెదేపా, కాంగ్రెస్ పార్టీల మరియు స్వతంత్ర అభ్యర్ధులు పోటీ నుండి విరమించుకొని తెరాసలో చేరిపోతుండటం విశేషం. తమ పార్టీల అభ్యర్ధులని, ఎంపిటిసిలని తెరాస నయాన్నో భయాన్నో లొంగదీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తెదేపా, కాంగ్రెస్ పార్టీ నేతలు తెరాస మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదన్నట్లు తెరాస వ్యవహరిస్తోందని కె. జానారెడ్డి విమర్శించారు.
వరంగల్ నుంచి కొండా మురళి అందరికంటే మొట్టమొదట ఎమ్మెల్సీ సీటు గెలుచుకొన్నారు. ఆ తరువాత మెదక్ నుండి భూపాల్ రెడ్డి, ఆదిలాబాద్- పురాణం సతీష్, నిజామాబాద్-భూపతి రెడ్డి, కరీంనగర్ లో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. కనుక మిగిలినవారు ఎన్నికలలో పోటీపడక తప్పదు. కానీ తెరాస జోరు చూస్తుంటే మిగిలిన ఆరు స్థానాలలో ఎంపీటీసీలను తనవైపు తిప్పుకొని వాటిని కూడా కైవసం చేసుకొనే అవకాశం కనబడుతోంది. అదే జరిగితే ఇక ఎన్నికలు, ఫలితాలు అన్నీ లాంచనప్రాయమే అవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close