సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ..!

తమిళ స్టార్ సూర్య తండ్రి శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం కేసు పెట్టింది. తమిళనాడులో జరిగిన ఓ సభలో శివకుమార్‌ తిరుమల ఆలయానికి వెళ్లవద్దని పిలుపునిచ్చిట్లుగా టీటీడీకి ఫిర్యాదు అందింది. తిరుమలలో డబ్బులున్న వారికే ఎక్కువ అతిధి మర్యాదలు లభిస్తాయని..గదులు..దర్శనం కూడా డబ్బులున్న వారికే దక్కుతుందని.. అలాంటి ఆలయానికి వెళ్లాల్సిన అవసరం ఉందా.. అని శివకుమార్ ప్రసంగించినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రసంగంపై తమిలనాడులో ఓ వ్యక్తి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 29న శివకుమార్‌పై కేసు నమోదైంది. ఆ ఫిర్యాదును ఈ మెయిల్‌ ద్వారా టీటీడీ విజిలెన్స్‌కు అందింది.

దీనిపై..తిరుమల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో టీటీడీ ఫిర్యాదు చేసింది.. పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్య తండ్రి శివకుమార్‌పై మాత్రమే కాదు.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టారంటూ..మరికొంత మందిపైనా టీటీడీ కేసులు పెట్టింది. తమిళనాడులో నమోదైన కేసును..టీటీడీ సీరియస్‌గా తీసుకోవడమే చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడు భక్తులు తిరుమలకు ఎంత ఎక్కువ మంది వస్తారో…అంత కంటే ఎక్కువగా…అక్కడ నాస్తిక వాద భావజాలం ఉన్న వారు ఉంటారు. అక్కడి ద్రవిడ పార్టీల మౌలిక సిద్ధాంతం.. దేవుడు లేడవే. ఆ భావజాలంతో ఎన్నో కామెంట్లు చేస్తూంటారు. అయితే.. సూర్య మాత్రం శ్రీవారి భక్తుడు. ఆయన తరచూ కుటుంబంతో శ్రీవారి దర్శనానికి వస్తూంటారు.

శివకుమార్ కూడా.. ఆలయంలో దర్శనాలు… ధనికులకు ఇచ్చే మర్యాదల గురించే మాట్లాడారు కానీ..దేవుడి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయినా టీటీడీ కేసు పెట్టింది. విశేషం ఏమిటంటే.. ఏపీ సీఎం జగన్ కు సూర్య క్లాస్‌మెంట్…బెస్ట్ ఫ్రెండ్ కూడా. శివకుమార్ పై తొందరపాటుగా టీటీడీ ఫిర్యాదు చేసి ఉంటుందని ఆ కేసు విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు ఉండవని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close