ఆ రెండు గ్రామాల రైతులు కూడా భూములు ఇచ్చేస్తున్నారు

రాజధాని నిర్మాణంకోసం ల్యాండ్ పోలింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం 29 గ్రామాలలో రైతుల నుంచి భూమి సమీకరించింది. అయితే ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఆ రెండు గ్రామాలలో రైతులు కూడా సుమారు 600 ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించారని రాష్ట్ర వ్యవసాయ శంఖుస్థాపన మంత్రి ప్రతిప్పటి పుల్లారావు మీడియాకు తెలిపారు. తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని, చిత్తశుద్ధిని గుర్తించి ఆ రెండు గ్రామాల రైతులు కూడా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు వచ్చేరని అందుకు వారికి ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. వారు కోరినట్లుగానే గ్రామ కంఠాల విస్తీర్ణాన్ని మరో వంద ఎకరాలకు పెంచేందుకు అవసరమయిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇంకా మరొక 1400 ఎకరాలను సమీకరించవలసి ఉందని త్వరలోనే ఆ రైతులు కూడా స్వచ్చందంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని పుల్లారావు అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close