దావూద్ ఇబ్రహీం కేరాఫ్ పాకిస్తాన్!

ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దం ఎందుకు?అని అనుకొంటాము. కానీ అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడనే సంగతి యావత్ ప్రపంచానికీ తెలిసినప్పటికీ దానిని అద్దంలో చూపించినట్లుగా ఆధారాలతో చూపిస్తేగానీ అది శాస్త్ర సమ్మతం కాబోదు. అందుకే శంఖంలో పోస్తేనే నీళ్ళు తీర్ధం అవుతాయనే మరొక నానుడి కూడా ఉంది. అతను ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలుగా అతని కోసం ప్రపంచదేశాలు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసాయి. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడనే సంగతి అన్ని దేశాలకు స్పష్టంగా తెలుసు. కానీ ఎవరూ పట్టుకొనే సాహసం చేయలేకపోవడం చూస్తే అతను ప్రపంచ దేశాల కంటే చాలా శక్తివంతుడనుకోవాలి లేకపోతే ప్రంచదేశాల చేతగానితనమని సరిపెట్టుకోవలసి ఉంటుంది.

1993 ముంబై ప్రేలుళ్ళలో ప్రధాన సూత్రధారిఅయిన అతను పాకిస్తాన్ లోనే తలదాచుకొన్నాడు కనుక అతనిని తమకు అప్పగించమని భారత్ కోరిన ప్రతీసారి పాకిస్తాన్ అతను తమ దేశంలో ఎక్కడా లేడని బుకాయిస్తోంది. ఇదివరకు లష్కర్-ఏ-తోయిబా అధినేత బిన్ లాడెన్ విషయంలోను పాక్ చివరి వరకు ఇలాగే బుకాయించింది. కానీ చివరికి అతను పాక్ భూభాగంలోనే పాక్ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నడనే విషయం అమెరికా కమెండోలు అతనిపై దాడి చేసి మట్టుబెట్టిన తరువాత ప్రపంచానికి తెలిసివచ్చింది. అదే విధంగా భారత్ పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులందరూ పాక్ లోనే శిక్షణ పొందుతున్నారని కొన్ని రోజుల క్రితం ఉదంపూర్ లో పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ పట్టుబడినప్పుడు మరోమారు స్పష్టమయింది.

దావూద్ ఇబ్రహీం పాక్ లో ఖచ్చితంగా ఎక్కడ నివాసం ఉంటున్నాడో తెలిపే బలమయిన ఆధారాలను భారత్ నిఘా వర్గాలు సంపాదించాయి. అతను తన కుటుంబంతో సహా కరాచీలోని క్లిఫ్టాన్ రోడ్డులో నివాసం ఉంటున్నట్లు భారత్ నిఘావర్గాలు కనుగొన్నాయి. అతని భార్యా పిల్లల వివరాలు, అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియజేసేందుకు అతని భార్య పేరిట ఉన్న ఫోన్ బిల్లు, అతని ఫోటో ఉన్న గుర్తింపు కార్డు, అడ్రస్ వగైరా అన్నీ భారత్ నిఘా వర్గాల చేతికి చిక్కాయి.

కానీ అంత మాత్రాన్న పాకిస్తాన్ అతనిని తెచ్చి భారత్ చేతికి అప్పగించేస్తుందని ఆశ పడితే అది అత్యాశే అవుతుంది. అతను ఇప్పుడు పాకిస్తాన్లో ఎక్కడ ఉంటున్నాడో భారత్ కి ఖచ్చితంగా తెలుసు కనుక అమెరికాలాగ అతని ఇంటి మీదకి భారత్ కమెండోలని పంపించి పట్టుకోవడం సాధ్యం కాదు. కనుక అతని పేరిట రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది కనుక ఆ వివరాలను ఐక్యరాజ్యసమితి చేతిలో పెట్టి అతనిని పట్టుకొని తమకు అప్పగించమని భారత్ కోరేందుకు ఉపయోగపడవచ్చును. కానీ ఐక్యరాజ్యసమితికయినా అతనిని పట్టుకొనే దైర్యం ఉంటే ఎప్పుడో పట్టుకొని ఉండేది. కనుక ఇప్పుడు భారత్ అతని అడ్రస్ కనుగొని చెప్పినంత మాత్రాన్న అతనిని అరెస్ట్ చేయడం ఎవరివల్లా కాదని భావించవచ్చును. ఒకవేళ అతని బుద్ధి బ్రష్టుపట్టి అమెరికా మీద దాడి చేసేందుకు కుట్ర పన్నితే మాత్రం అతనికీ బిన్ లాడెన్ కి పట్టిన గతే పట్టడం తధ్యం. అతను అటువంటి ఆలోచనలు చేయనంతవరకు అతనికి వచ్చే నష్టం, కష్టం ఏమీ ఉండకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close