విజయవాడకు మెట్రోరైలు కుదరదన్న కేంద్రం

విజయవాడలో మెట్రోరైలు సాధ్యంకాదని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కేంద్రం ప్రస్తావించిన సూచికల ప్రకారం విశాఖపట్టణంతో సహా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా మైట్రోరైలు వచ్చే అవకాశాలు లేవు. విజయవాడలో మెట్రోరైలు ఏర్పాటు చేయడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సర్వే చేసి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) రూపొందించింది. ఇందుకు రాష్ట్రప్రభుత్వం 25 కోట్లరూపాయలు చెల్లించింది. డిపిఆర్ ని రాష్ట్రం కేంద్రప్రభుత్వానికి పంపింది. కేంద్రం కొద్దిరోజుల క్రితం ఈ ప్రాజెక్టు అమలు సాధ్యంకాదని రాష్ట్రానికి సమాధానం పంపింది. ఇందుకు రెండు కారణాలను పేర్కొన్నారు.

మేట్రో రైలుకి నిర్మించాలంటే ఆప్రాంతపు జనాభా కనీసం 18 లక్షలు వుండాలి. అయితే విజయవాడ జనాభా 2020 నాటికి కూడా 10 లక్షలకు మించడంలేదని కేంద్రం అభ్యంతరాన్ని వెలిబుచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 20 శాతం నిధుల్ని కేంద్రం గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 80 శాతం నిధుల్ని రాష్ట్రప్రభుత్వం సమకూర్చుకోవాలి. అయితే ఈ నిధులు ఎలాసమకూరుస్తారో రాష్ట్రప్రభుత్వం వివరించలేదని కేంద్రం పేర్కొంది. అయితే ఇది తిరస్కారం కాదని వివరణలు కోరడం మాత్రమేనని ఒక ఉన్నతాధికారి చెప్పారు. తగిన సమాధానాలతో ప్రాజెక్టు నివేదికను మళ్ళీ కేంద్రానికి పంపి ఆమోదం తెచ్చుకోవచ్చు. కేంద్రం గ్రాంటు పెంచేలా చేసుకోవచ్చు. జనాభా నియమాన్ని సడలింపచేసుకోవచ్చు అని ఒక ఉన్నతాధికారి చెప్పారు.

ఇదంతా జరగాలంటే శక్తివంతమైన రాజకీయ లాబీయింగ్ అవసరం. అదికూడా సాధించుకున్నాం అనుకున్నా ఎకనమిక్ వైబిలిటీ లేకపోతే మెట్రోరైల్ ఆపరేటర్ ముందుకి వస్తారా అన్నదే అసలు ప్రశ్న. ఆర్ధిక పరమైన గిట్టుబాటుకి వినియోగదారుల సంఖ్య అంటే జనాభా ఒక కొలమానం. దీన్ని బట్టి విజయవాడకు ఇప్పట్లో మెట్రోరైలు రాదని అర్ధం చేసుకోవచ్చు. ఇదే వాస్తవికత విశాఖపట్టణానికి కూడా వర్తిస్తుంది.

తెలిసో తెలియకో రాజకీయనాయకులు చూపించే రంగుల సినిమాలను వాస్తవికతలు అట్టర్ ఫ్లాప్ చేస్తాయనడానికి విజయవాడ మెట్రోరైలు ఒక ఉదాహరణ మాత్రమే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close