కొరివితో తలగోక్కున్న తెరాస !

సంపన్న రాష్ట్రం, సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రమని డంకా బజాయించే తెరాసకు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలంటే అంత గుబులెందుకో అర్థం కావడం లేదు. ఏకంగా 25 లక్షల మంది సీమాంధ్ర ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడానికి పన్నాగం పన్నిందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఈసీ అధికారులు సైతం ఆశ్చర్యపోయేలా ఓట్ల తొలగింపు బాగోతాలు బయటపడుతున్నాయి.

సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజ్ గిరి తదితర నియోజకవర్గాల్లో భారీగా ఓట్లను తొలగించారు. నోటీసు ఊసే లేకుండా నిరంకుశంగా వ్యవహరించారు. అడిగే వారే లేరన్నట్టు ఆటవిక రాజ్యాన్ని తలపించేలా అధికారులు వ్యవహరించారు. వెనక ఎవరో బలవంతులు లేకపోతే ఇంత అడ్డగోలుగా ఓట్లను తొలగించే ధైర్యం అధికారులకు ఎక్కడిది?

నిన్న మొన్నటి వరకూ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సోమేష్ కుమార్ తెరాస కార్యకర్తలా వ్యవహరించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెరాస నాయకత్వం సూత్రధారి అయితే సోమేష్ కుమార్ ప్రధాన పాత్రధారిగా ఓట్ల తొలగింపు జరిగిందని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆయన్ని బదిలీ చేసినంత మాత్రాల పాపం పరిహారం కాదని ప్రతిపక్ష నేతలు, ప్రజలు దుయ్యబడుతున్నారు. ఒక కమిషనర్ ఇంత అరాచకంగా లక్షల ఓట్ల తొలగింపు అనే కుట్రలో రాజకీయ పార్టీ కార్యకర్త స్థాయిలో భాగస్వామి కావడం ఏమిటని కాంగ్రెస్, తెదేపా సహా మొత్తం విపక్షం ఏకతాటిపై నిలిచి ప్రశ్నిస్తోంది.

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు, 25 లక్షల సీమాంధ్ర ఓట్లను తొలగించడానికి కేసీఆర్ కుట్ర పన్నారా? దీనికి ఆయనే జవాబు చెప్పాలి. అయితే, ఇంత భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరిగిన తీరు చూసి ఈసీ అధికారులు విస్తుపోతున్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం వారిని టార్గెట్ చేసి ప్రజల ఓటు హక్కును కాలరాయడం ఎంత నిస్సిగ్గుగా జరిగిందో వారు గమనిస్తున్నారు. చివరకు, తెరాస మిత్రపక్షం ఎం ఐ ఎం కూడా ఓట్ల తొలగింపు తీరుపై ఈసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. బహుశా ఒక్క నగరంలోనే 25 లక్షల ఓట్ల తొలగించడానికి కుట్ర జరిగిందనే భారీ ఆరోపణ భారత దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం మీదా వచ్చి ఉండదు. ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఆ అపప్రధను మూటగట్టుకుంది మరోవైపు, జనవరిలోగానీ ఎన్నికలు జరపలేమని ప్రభుత్వం చెప్తోంది. గ్రేటర్ లో ఓటమి ఖాయమని తెరాస చేష్టలే స్పష్టం చేస్తున్నాయనే ప్రతిపక్షాల దూకుడు విమర్శలను సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితి గులాబీ శ్రేణుల్లో లేదు. తమ గెలుపు అనుమానమేనని చాలా మంది తెరాస నేతలు ఆఫ్ ది రికార్డుగా ఒప్పుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయితే మరోసారి టీడీపీ, బీజేపీ పాగా వేయడం ఖాయమని ఆ పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. టీడీపీ అయితే ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. తెరాసకు కోలుకోలేని షాకిచ్చి సత్తాను చాటుతామంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. అధికార తెరాస శ్రేణులు మాత్రం గుబులు గుబులుగా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close