అవి అంత ఉత్తమ్ ఐడియాలు కావేమో?

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికల కోసం రకరకాల వ్యూహాలు రచిస్తున్నట్లున్నారు. కానీ వాటిలో ఏ ఒక్కటీ పనిచేస్తున్నట్లు లేదు. పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయకమునుపే తన పార్టీ కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో ఎన్నికలలో గెలుస్తుందని ప్రకటించారు. అంటే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరయినప్పటికీ పార్టీ బలంతోనే గెలవగలమని ధీమా వ్యక్తం చేస్తున్నట్లుంది. బహుశః తెరాస ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందనే ఆయన దృడంగా నమ్ముతున్నందునే అంత ధీమాగా ప్రకటించారేమో? ఆ సవాలును ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వీకరించినట్లే ఉన్నారు. ఆయన కూడా ఈసారి ఎన్నికలు అభ్యర్ధుల మధ్య కాక పార్టీల మధ్యనే జరుగుతాయని ప్రకటించేశారు. దానితో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంగు తిన్నారు.

ఆ తరువాత అయన మరొక ఊహించని ప్రతిపాదన చేసారు. అధికార గర్వంతో విర్రవీగుతున్న తెరాసకు బుద్ది చెప్పాలంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ (తెదేపా-బీజేపీలు తప్ప) ఒక్క త్రాటిపైకి వచ్చి పోరాడాలని కోరారు. అయితే అన్ని పార్టీలు వచ్చి కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ అది చాలా అత్యాశేనని ఆయనకీ తెలిసే ఉంటుంది. వామ పక్షాలన్నీ కలిసి గాలి వినోద్ కుమార్ ని, తెరాస దయాకర్ ని, వైకాపా తన స్వంత అభ్యర్ధిని, తెదేపా-బీజేపీలు ఉమ్మడి అభ్యర్ధిని నిలబెడుతున్నాయి. వారు కాక స్వతంత్ర అభ్యర్ధులు చాలా మంది బరిలో ఉండనే ఉంటారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సిరిసిల్ల రాజయ్య వారందరినీ ఎదుర్కొని పోరాడి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించగలరో లేదో ఫలితాలు వెలువడితే కానీ తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార పార్టీకి సవాలు విసరబోయి తన స్వంత అభ్యర్ధికే అగ్ని పరీక్ష పెట్టుకొన్నట్లయింది.

తాజాగా ఆయన మరో మాట చెప్పారు. ఈ ఎన్నికలను తాము రెఫరెండంగా స్వీకరిస్తున్నామని చెప్పారు. అయితే ఆ మాట అధికారంలో ఉన్న తెరాస చెప్పి ఉండి ఉంటే చాలా ముచ్చటగా ఉండేది. సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా అటువంటి పొరపాటు చేయదు. కనుక ప్రతిపక్షాలే ప్రతీ ఎన్నికలను రిఫెరెండంగా ప్రకటించుకొని తృప్తి పడుతుంటాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్దే విజయం సాధించినట్లయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన ఈ రిఫరెండం తెరాసకు మరింత లబ్ది చేకూర్చుతుంది. కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం కలిగిస్తుంది. ఎన్నికలకు ముందు ఆయన విసిరిన ఈ సవాలును స్వీకరించడానికి తెరాస ఇష్టపడనప్పటికీ ఎన్నికలలో గెలిస్తే తప్పకుండా ఈ ‘రిఫరెండం’ విషయాన్ని హైలైట్ చేసి తమ సమర్ధమయిన పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే ఈ విజయం అని, కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ప్రజలు విశ్వసించడం లేదని గొప్పగా చెప్పుకొంటుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీయే ప్రజల ముందు తల దించు కోవలసివస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close