ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు ఎవ‌రికీ అంత టైమ్ లేదు. ఒక‌ర్ని న‌మ్ముకోవ‌డం, వాళ్ల‌కు ఆ పాట అప్ప‌జెప్ప‌డం, వాళ్ల‌తోనే రెండు మూడు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇదే తీరు.

కానీ `ఉప్పెన‌` విష‌యంలో మ‌ళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. వైష్ణ‌వ్ తేజ్ హీరో. ఇప్ప‌టికి రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. `నీ క‌న్ను నీలి స‌ముద్రం` పాటైతే సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిపోయింది. రెండో పాట `థ‌గ్ థ‌గ్‌..` కూడా ఓకే అనిపించుకుంది. దాంతో ఈ ఆల్బ‌మ్ పై అంచ‌నాలు పెరిగిపోయాయి. అందుకే దేవి ఇచ్చిన ఓ మంచి ట్యూన్‌ని ఏకంగా న‌లుగురు గీత ర‌చ‌యిత‌ల‌కు ఇచ్చాడ‌ట ద‌ర్శ‌కుడు. చంద్ర‌బోస్‌, రామ‌జోగ‌య్య‌, శ్రీ‌మ‌ణి, బాలాజీ..ల‌తో ఈ పాట రాయించుకున్నార్ట‌. వాళ్ల‌లో రామ‌జోగ‌య్య పాట అద్భుతంగా కుదిరింద‌ని టాక్‌. దాన్ని సుకుమార్ ఓకే చేసి, దేవికి పంపితే.. `నాకు ఈ పాట వ‌ద్దు…` అని దేవి తిర‌స్క‌రించాడ‌ని తెలుస్తోంది. ఈ పాట విష‌యంలో దేవి – సుక్కు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ్డార్ట‌. సుకుమార్ రామ‌జోగ‌య్య వైపు ఉంటే.. దేవి మాత్రం `మ‌రొక‌రితో మ‌రో వెర్ష‌న్ రాయించండి` అని చెప్పాడ‌ని టాక్. రామ‌జోగ‌య్య రాసిన పాట నిజంగానే దేవికి న‌చ్చ‌లేదా? లేదంటే రామ‌జోగ‌య్య ఇచ్చిన పాట తీసుకోవ‌డం దేవికి ఇష్టం లేదా? అనేది సుకుమార్ తేల్చుకోలేక‌పోయాడ‌ని, అందుకే.. `ఈ పాట విష‌యంలో ఎలాంటి నిర్ణ‌య‌మైనా నువ్వే తీసుకో..` అని బాధ్య‌త అంతా బుచ్చిబాబుకే అప్ప‌గించేసిన‌ట్టు టాక్‌. న‌లుగురితో పాట రాయించినా, ఎవ‌రి పాట ఓకే చేశారో, ఆయా గీత ర‌చ‌యిత‌ల‌కే చెప్ప‌లేద‌ని, ఆ పాట బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ.. ఎవ‌రి పాట ఉంటుందో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ పాట బ‌య‌ట‌కు రాబోతోంది. మ‌రి ఎవ‌రి వెర్ష‌న్ ఉంటుందో? ఎవ‌రి మాట నెగ్గించుకున్నారో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close