తన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందని కనీసం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేలా అవకాశం కల్పించాలని వల్లభనేని వంశీ పెట్టుకున్న పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలోఆయనకు చికిత్స అందించే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ తనకు ఆరోగ్యం బాస్ లేదని పదే పదే చెబుతూండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించారు. అంతా బాగుందని రిపోర్టులు రావడంతో మళ్లీ జైలుకు తరలించారు.
ఈ క్రమంలో వైసీపీ నేతలు ప్రభుత్వ డాక్రర్లపై దారుణమైన భాషతో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ డాక్టర్లు కూడా వీరి తీరును ఖండించారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయుష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత ఆయనను ఇన్ పెషంట్ గా చేర్చాల్సిన అవసరం ఉందా లేదా అన్నదానిపై రిపోర్టులు తేలే అవకాశం ఉంది. హైకోర్టు పరిశీలించి.. ఇన్ పేషంట్ గా చేర్చాలా లేకపోతే జైల్లో ఉంచి వైద్యం అందిస్తే సరిపోతుందా అన్నది తేల్చే అవకాశం ఉంది.
వల్లభనేని వంశీకి పలు కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో బెయిల్ రావాల్సి ఉంది. పోలవరం కాలువ గట్లను తవ్వేసి మట్టిని అమ్మేసుకున్న కేసులో బెయిల్ రావాల్సి ఉంది. మరో వైపు ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు జత్వానీ కేసులో బెయిల్ వచ్చింది. ఇంకా ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో బెయిల్ రావాల్సి ఉంది. ఆ కేసులో ఇంకా జైల్లోనే ఉండాల్సి ఉంది.